(హైదరాబాద్,న్యూస్ఇన్)
వేసవి కాలంలో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రకటించిన సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ ముగిసింది. మూడు నెలల (మార్చి, ఏప్రిల్, మే ) పాటు ఇచ్చిన రాయితీ గడువు ముగియడంతో, జూన్ 1 నుండి మెట్రో డీలక్స్ మరియు ఏసీ బస్సుల్లో పాత చార్జీలను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఈ మార్పుపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఒక స్పష్టతనిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఎలాంటి ఛార్జీలను పెంచలేదని, కేవలం వేసవి కాలం కోసం ప్రత్యేకంగా అందించిన సమ్మర్ డిస్కౌంట్ గడువు మాత్రమే ముగిసిందని పేర్కొంది. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సంస్థకు సహకరించాలని అధికారులు కోరారు.
తీవ్రమైన ఎండల దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సుఖవంతమైన, ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సమ్మర్ ఆఫర్ను ప్రవేశపెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెట్రో డీలక్స్ మరియు ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మార్చి 2026 నుండి మే 31, 2026 వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. మూడు నెలల పాటు కొనసాగిన సాగిన ఈ ఆఫర్ గడువు ముగియడంతో జూన్ మొదటి తేదీ నుండి రాయితీకి ముందు ఉన్న పాత టికెట్ ధరలే అమలులోకి వస్తాయి.
తీవ్ర వేసవి దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమ్మర్ ఆఫర్ను నిర్వహించడం జరిగింది. ఈ మూడు నెలల పాటు ఆఫర్ను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరించిన ప్రయాణికులకు సంస్థ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది.











Leave a Reply