(హైదరాబాద్,న్యూస్ఇన్)
వేసవి తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కళాశాలల సెలవులు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తగ్గక పోవడం, తీవ్రంగా వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. జూన్ 6వ తేదీ వరకు పొడిగించారు. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ వర్సిటీలు జూన్ 6 వరకు సెలవులను పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేశాయి. కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగించాయి











Leave a Reply