(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిలిచింది. సీజన్ మొదలైన నాటి నుంచి అన్ని విభాగాల్లో రాణిస్తున్న ఆర్సీబీ వరుసగా రెండోసారి విజయాన్ని దక్కించుకుంది. ఫైనల్స్ లో కోహ్లీ ఇన్నింగ్స్ ఆర్ సి బి ని ఛాంపియన్ గా నిలిపింది. కోహ్లీ 75 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు.గుజరాత్ టైటాన్స్ పై బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న రాజత్ పాటిదార్ అనుకున్నట్లే గుజరాత్ బ్యాటర్ల దూకుడు బ్రేకులు వేశారు. ఆర్సీబీ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ గుజరాత్ పై ఒత్తిడి పెంచారు.

సాధారణ స్కోరు కు గుజరాత్ ను బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో 156 పరుగుల లక్ష్యంతో ఐపీఎల్ ట్రోఫీని మరోసారి చేజిక్కించుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఆర్ సి బి ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ శుభారంభాన్ని అందించారు. పవర్ ప్లే లోనే వికెట్ లేమి కోల్పోకుండా 60 పరుగులకు జట్టు స్కోరుని చేర్చారు. 6వ ఓవర్ లో వెంకటేష్ అయ్యర్ తొలి వికెట్ రూపంలో వేను దిరిగారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దేవ దత్ పడిక్కల్ కేవలం ఒక పురుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. దీంతో గుజరాత్ జట్టుకు విజయంపై భారీగా ఆశలు పెరిగాయి. కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 15 పరుగులు చేసి అవుట్ కాగా, కృనాల్ పాండ్యా ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రన్ రేట్ భారీగానే ఉన్న 9 ఓవర్లలో 91 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది.

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గ్రీజులో ఉండడంతో ఆర్ సి బి జట్టు గుజరాత్ పై పూర్తి ఆధిపత్యంలో కనిపించింది. వరుసగా వికెట్లు కోల్పోయిన కోహ్లీ అనుభవంతో మరోసారి ఐపిఎల్ ట్రాఫిని బెంగళూరుకు కట్టబెట్టే విధంగా ఇన్నింగ్స్ నిర్మించారు. కోహ్లీతో జత కలిసిన టీం డేవిడ్ ఆర్ సి బి విజయానికి చేరువ చేశారు. మరో వికెట్ కోల్పోకుండా స్కోరు ను 131 పరుగుల కు చేర్చారు. టీమ్ డేవిడ్ క్రీజులో కుదురుకున్న కోహ్లీకి అవకాశం కల్పిస్తూ పూర్తిగా సహకరించారు. 24 పరుగులు చేసిన అనంతరం డేవిడ్ అవుట్ అయ్యారు. ఓపెనర్ గా వచ్చి క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ 36 బంతులు మాత్రమే ఎదుర్కొని విలువైన 63 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కోహ్లీకి జితేష్ కలిసారు. ఇక ఆర్సిబి విజయం సాధించేందుకు అతి తక్కువ పురుగులు మాత్రమే అవసరం ఉండడం దాదాపు 5 ఉండడంతో జట్టు విజయం లాంఛనంగానే మారింది. కోహ్లీ ఇన్నింగ్స్ తోనే ఆర్సిబి ఈ మ్యాచ్ ను ఏకపక్షంగా విజయం సాధించగలిగింది. చేసింగ్ లో కోహ్లీ రికార్డులు మరోసారి అందరికీ ఈ ఇన్నింగ్స్ ద్వారా గుర్తు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి కోహ్లీ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ – 2026 ట్రోఫీ అందుకుంది.

మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. ఈ ఐపీఎల్ సీజన్ లో శుభ రంభం అందించిన ఆ జట్టు ఓపెనర్లు ఈ మ్యాచ్ లో మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. శుభమన్ గిల్ తొలి వికెట్ రూపంలో వెనుతిరగడంతో ఆర్ సిబి బౌలర్లు వత్తిడి పెంచడం మొదలైంది సాయి సుదర్శన్ త్వరగానే పెవిలియన్ చేరడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. జోస్ బట్లర్, నిశాంత్ సింధు కొంతసేపు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. దీంతో ఒక దశలో గుజరాత్ 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించే విధంగా ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఓవైపు వికెట్లు పడుతున్నా సుందర్ ఒంటరి పోరాటం చేసి అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. ఇదే గుజరాత్ జట్టులో అత్యధిక స్కోరు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో… గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితం అయింది. రషీక్ సలాం మూడు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ హేజిల్ వుడ్ లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.











Leave a Reply