(పాలమూరు,న్యూస్ఇన్)
పాలమూరు లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన వెయ్యి పడకల ఆసుపత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.మహాబూబ్ నగర్ కు సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అవసరమని కెసిఆర్ ను ఒప్పించి వెయ్యి పడకల అస్పత్రి తీసుకువచ్చానన్నారు. నిర్మాణం పూర్తయి కలర్స్ వేసే వరకు పనులు మా హయాంలో పూర్తి చేశామన్నారు. ఆసుపత్రిని ప్రారంభించకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి భవనాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలో తాను మొదలుపెట్టిన కీలక అభివృద్ధి పనులన్నీ పెండింగ్ లో ఉంచడం పై ఘాటుగా స్పందించారు.

జూన్ 2 ప్రారంభం చేస్తారని ప్రజాప్రతినిధులు చెప్తే టెండర్లు పిలిచి వసతులు కల్పించి ప్రారంభిస్తారని అనుకున్న కానీ చేయలేదన్నారు.రెండున్నర యేండ్ల నుంచి పనులు చేస్తారని వేచి చూసాము.. అధికారులు వెంటనే టెండర్ పిలిచి సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు ప్రారంభించాలి. రిబ్బన్ లు కట్ చేసి శిలాఫలకలు పెట్టకుండా భవనం లో పరికరాలు.. వసతులు కల్పించి సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.
మన్యంకొండ రోప్ వే పనులు ప్రారంభం అయ్యాయి..సాయిల్ టెస్ట్ అయింది..కానీ కాంట్రాక్టర్ వెళ్ళిపోయిండు..పేదల తిరుపతి గా పెరుగంచిన మన్యంకొండ వద్ద రోప్ వే చేస్తే భక్తుల సంఖ్య పెరుగుతుంది. హరిత హోటల్ నిర్మాణం పనులు అక్కడే నిలిచి పోయాయన్నారు. 100 గదుల నిర్మాణంకు శంకుస్థాపన చేసి,18 గదుల నిర్మాణం పూర్తి తామే చేశామన్నారు. ట్యాంక్ బండ్ లో నెక్లెస్ రోడ్డు.. ఉమెన్స్ పార్క్.. ఫుడ్ కోర్టు..సీనియర్ సిటిజెన్ ట్రాక్.. సైకిల్ ట్రాక్..చిల్డ్రన్స్ పార్క్.మ్యూజికల్ నైట్ ఏర్పాటు కు అవసరం అయినా వసతులు.. ఐలాండ్ వెళ్లేందుకు బ్రిడ్జి ఇవి పూర్తి చేస్తే ట్యాంక్ బండ్ ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలి.. లేకుంటే స్క్రాప్ గా అమ్ముకావాల్సి వస్తుందని హెచ్చరించారు.












Leave a Reply