సోషల్ మీడియాలో పోస్టు వైరల్
కాంగ్రెస్ లో జోరుగా చర్చ
రేవంత్ నమ్మిన బంటే కోవర్టు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలక నిర్ణయాలు ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి చేరుతున్నాయి. చాలా రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలకు ఈ అంశంపై ఎన్నో అనుమానాలు కీలక నేతలను వెంటాడుతున్నాయి.ఇంటి దొంగ ఎవరనే దానిపై సీఎం కూడా ఓ అభిప్రాయానికి రాలేక పోయారని సన్నిహితులు అంటారు. అధికారుల నుంచి సమాచారం వెళుతుందా….నాయకుల నుంచి లీక్ అవుతుందా అన్నదానిపై అమాత్యుల్లోనే ఎవరైనా సమాచారం ఇచ్చారా అన్న వరకు పరిస్థితి వెళ్ళింది.

హిల్ట్ పాలసీ గురించి పూర్తి స్థాయిలో కేబినెట్కు కూడా వివరాలు తెలియక ముందే.. బీఆర్ఎస్కు తెలిసిపోవడంతో కోవర్ట్ చాలా ఉన్నత స్థాయిలోనే ఉన్నారన్న క్లారిటీ ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. ఈ అంశంపై అంతర్గతంగా దర్యాప్తు చేసిoది. నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదిక సీఎం వద్దకు ప్రస్తుతం చేరిందని తెలుస్తోంది.
మహా నివేదిక ప్రకారం అసలు కోవర్ట్ ఎవరో కాంగ్రెస్ పెద్దలకు తెలిసిపోయిందని చెబుతున్నారు. ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మారని, తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా ఉన్న ఆయన సిన్సియారిటీ తో పాటు ఉద్యమ సమయాన్ని తన అనుభవంతో అనుకూలంగా మలుచుకున్నారట.కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లా నుంచి వచ్చిన ఆయనకు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కీలకం పదవిని సీఎం కట్టబెట్టారు. సీఎంతో నిత్యం సమావేశాల్లో పాల్గొనేంత కీలక పదవి ఇచ్చారు. తర్వాత రాజ్యాంగబద్దమైన పదవి ఇచ్చారు. పదవి ఏదైనా తనకు ఉన్న చనువుతో కీలక విషయాలను తెలుసుకునేవారు . వాటిని గుట్టుచప్పుడు కాకుండా.. బీఆర్ ఎస్ పార్టీలోని తన సన్నిహితులకు బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు పంపుతున్నారన్న అనుమానాలు అధికార పార్టీ నేతల్లో బలపడుతున్నాయి.
హిల్ట్ పాలసీ కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇలాగే ఫార్వార్డ్ అయ్యాయని చెబుతున్నారు.
అయితే రేవంత్ చాలా నమ్మకం పెట్టుకున్న ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు కుమ్మక్కయ్యారని.రేవంత్ కు ఎందుకు ద్రోహం చేశారన్నది హైలెవల్లో జరుగుతున్న చర్చ. దీనికి కూడా కారణాలు ఉన్నాయని అంటున్నారు. డబ్బుతో పాటు హనీట్రాప్ బారిన పడ్డారని.. బ్లాక్ మెయిల్ కారణంగానే ఇలా కోవర్టుగా మారారని ప్రకారం జరుగుతుంది. ఆయన పై ఇప్పటికే కొంత మందికి స్పష్టత వచ్చిందనీ,సీఎం రేవంత్ ముందున్న నివేదికతో ఎలాంటి నిర్ణయం ఉంటుందో అన్న చర్చ జరుగుతుంది





Leave a Reply