రైల్వే శాఖ కీలక నిర్ణయం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలో ప్రతి ఏటా రైలు ప్రమాదాలతో వందలాది వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. వన్యప్రాణుల రక్షణకోసం రైల్వేశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ఈ శాన్య రాష్ట్రాల్లో విజయవంతగా నడుస్తుండడంతో క్రమంగా విస్తరించేందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది.ప్రధానంగా అటవీ మార్గాలు ఉండే ప్రాంతాల్లో వన్య ప్రాణులను రైళ్లు ఢీ కొంటుండడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. ఎక్కువగా ఏనుగులు ఈ ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు AI ఆధారిత సేవలను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విదానంలోరైల్వే ట్రాక్లపై ఏనుగులున్న ప్రాంతాలను గుర్తించేందుకు డిస్ట్రిబ్యూటెడ్ ఎకౌస్టిక్ సిస్టమ్ (DAS) ఉపయోగించి డిటెక్షన్ సిస్టమ్ (IDS) గుర్తించి లోకో పైలెట్ లను అప్రమత్తం చేస్తోంది.ఏనుగులను ఢీకొనడాన్ని నివారించడానికి ఈశాన్య సరిహద్దు రైల్వేలో 141 RKMS విభాగంలో AI విధానాన్ని రైల్వేశాఖ అమలు చేసింది. ఈ విధానం సిస్టమ్ విజయవంతంగా పని చేస్తోందని రైల్వే గుర్తించింది.

ఈ పనితీరు ఆధారంగానే 981 RKMల రైల్వేశాఖ అమలు చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ఈ విధానంలో సిస్టమ్ లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, కంట్రోల్ రూమ్ల కోసం రైల్వే ట్రాక్లకు సమీపంలో ఏనుగుల కదలిక గురించి హెచ్చరికలను పంపిస్తుంది.ఇది వన్యప్రాణులనుకాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.లోకో పైలట్లను 0.5 కి.మీ ముందుగానే అప్రమత్తం అయ్యేందుకు అవకాశం కల్పిస్తోంది.
రైల్వే ట్రాక్లపై వన్యప్రాణులైన ఏనుగులు, సింహాలు,చిరుత పులులను ప్రాణాలతో కాపాడేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలను పకడ్భంధీగా అమలు చేయాలని భావిస్తోంది.






Leave a Reply