(స్పోర్డ్స్ డెస్క్, న్యూస్ఇన్)

సంజుశాంసన్ తన టీ-20 ల్లో తన ఫాం కొనసాగిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రంగంలోకి దిగిన శాంసన్ మరోసారి బ్యాటింగ్ తో జట్టు స్కోరును భారీగా మలిచారు. ఓపెనర్లుగా శాంసన్, రుజురాజ్ గైక్వాడ్ లు సీ ఎస్ కే ఇన్నింగ్స్ మొదలు పెట్టి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్ భాగస్వామ్యం కోసం 6,2 ఓవర్లలో 62 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ నిదానంగానే మొదలైనా సగం ఓవర్లు పూర్తయ్యే సరికి రన్ రేట్ సగటు 10కి చేరుకుంది. గైక్వాడ్ 18 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తో 15 పరుగులు సాధించి 62 పరుగుల వద్ద 7వ ఓవర్లో ఔటయ్యారు.
ఆ తరువాత సంజు శాంసన్, ఆయుష్ మాత్రేలు సీఎస్ కే స్కోరును ఏడా పెడా బాదుతూ పెంచుతూ వచ్చారు. ఏ దశలోనూ చెన్నై బౌలర్లు ఈ ఇద్దరిపై ప్రభావం చూపలేకపోయారు. సంజు శాంసన్ ప్రపంచకప్ తరువాత మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడారు. 52 బంతులు ఎదుర్కొని 102 పరుగులు సెంచరీ సాధించారు. ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేశారు.ఐపీ ఎల్ లో నాలుగు సెంచరీలు చేసి అగ్రశేణి బ్యాటర్ల సరసన సంజు చేరారు.

మరో వైపు యువ సంచలనం మాత్రే జోరును కొనసాగిస్తూ జట్టు స్కోరును పెంచారు. 36 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేశారు. కానీ జట్టు యాజమాన్యం నిర్ణయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగారు. మాత్రే స్థానంలో శివందుబే బ్యాటింగ్లో సంజుతో జత కట్టారు. స్కోరు పెంచాలన్న లక్ష్యంగా సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది. 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఈ స్కోరులో సంజు 56 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 4 సిక్స్ ల సహాయంలో 115 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. శివం దుబే 10 బాల్స్ ఆడి 20 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.









Leave a Reply