- కమిషనర్ల నియామకం
- గ్రేటర్ పరిధి విస్తరణ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రోజు రోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మూడు ముక్కలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు అదనంగా రెండు కార్పోరేషన్లను ఏర్పాటు చేసి వాటికి కమిషనర్లను నియమించింది. గ్రేటర్ పాలక మండలి గడువు పూర్తి కావడంతో నేటి నుంచే మూడు కార్పోరేషన్ల విధానం అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 1.40 కోట్ల జనాభా ఉన్నా…. భవిష్యత్తులో మరింత పెరిగే మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రాంతాన్ని ఫోర్త్ సిటీ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను అమలు చేస్తోంది.

వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ ను విభజించి పాలనను ప్రజలకు అందుబాటులోకి తేవడంతో పాటు… సౌకర్యాల కల్పనను మెరుగు పరచాలని భావిస్తోంది. ఓ ఆర్ ఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాలను గ్రేటర్ పరిధిలోకి సర్కార్ తెస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు విభాగాలుగా గుర్తిస్తూ…అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది.

ఓఆర్ ఆర్ పరిధిలోని ప్రాంతాలతో కలిపి మూడు విభాగాలుగా ప్రభుత్వం గుర్తించించి పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా కార్పోరేషన్ల కమిషనర్ల నియామయం, బాధ్యతలు తీసుకోవడం కూడా యుద్ధ ప్రాతిపాదకన పూర్తయ్యాయి. 10వ తేదీ నాటికి గ్రేటర్ పాలక మండలి పదవీ కాలం ముగియడంతో 11 వ తేదీ ఉదయం 9 గంటలలోపే కొత్తగా ఏర్పాటైన రెండు కార్పోరేషన్లకు నియమించిన కమిషనర్లు బాధ్యతలు కూడా తీసుకున్నారు. న్యాయ పరమైన చిక్కులు ఎదురుకావద్దన ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు వెంటనే బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలతో కొత్త కమిషనర్లుగా సైబరా బాద్ కార్పోరేషన్ కు సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ గా టి.వినయ్ కృష్నా రెడ్డి బాధ్యతలు కూడా తీసుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ గా ఆర్ వి. కణ్ణన్ కొనసాగుతున్నారు.

మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయాన్ని 74 వార్డులతో ఏర్పాటు చేశారు. తార్నాక లోని హుడా కార్యాలయంలో గ్రేటర్ మల్కాజిగిరి కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 76 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నా…వాటి పునర్వ్యవస్థీకరణ జరిగుతూ అదే సంఖ్యలో డివిజన్లను కొనసాగిస్తున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కండ జోన్ల పరిధిలో హైదరాబద్ కార్పోరేషన్ పరిధిని నిర్ణయించారు.
మల్కాజిగిరి కార్పోరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ లతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్ లతో గ్రేటర్ సైబరాబాద్ ( గ్రేటర్ శేరిలింగంపల్లి ) కార్పొరేషన్ పరిధిని గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 650 చదరపు కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసి , ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం జిహెచ్ఎంసి విస్తీర్ణం 2050 చదరపు కిలోమీటర్లకు దాదాపు నాలుగంతలు పెరిగింది.
ఇక గ్రేటర్ విభజన పూర్తి కావడంతో….మరో ఆరు నెలల్లో గ్రేటర్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కార్యవర్గాలు కొలువు దీరే వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మూడు కార్పోరేషన్లు కొనసాగనున్నాయి.




Leave a Reply