- పరిధి మార్పుపై జనగణన ఎఫెక్ట్
- కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఏడాది నుంచి కసరత్తు మొదలు పెట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధి మారుస్తూ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పోరేషన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ను యధావిధిగా కొనసాగిస్తూ…. పెరుగుతున్న జనాభా విస్తీర్ణం దృష్టిలో ఉంచుకుని పరిపాలన సౌలభ్యం కోసం మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం అమలు చేస్తూ గ్రేటర్ కాల పరిమితి ముగియడంతోనే సర్కార్ కొత్త కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ ఆ కార్పోరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త కార్పోరేషన్లకు నియమించిన అధికారులు అదే రోజు బాధ్యతలు తీసుకున్నారు. ఇదంతా సవ్యంగా ప్రభుత్వం పూర్తి చేసింది…..

జనగణన నిబంధనల అమలుపై అభ్యంతరం…..
కానీ తాజాగా తెరపైకి వచ్చిన అంశం ప్రభుత్వం నిర్ణయం ఎంత వరకు అమలువుతుందన్నది ఆసక్తి రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం జనగణన కోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ విడుదల కు ముందు అన్ని రాష్ట్రాలకు పలు సూచనలను కేంద్రం చేసింది. ఈ సూచనల ప్రకారం రాష్ట్రాలు జనగణణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న పరిధి లు మర్చారదన్న నిబంధనను విధించింది. అయితే తెలంగాణా సర్కార్ ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ను మూడు ముక్కలు చేసింది. కేంద్రం గత ఏడాది ఆగస్టులో అన్ని రాష్ట్రాలకు జనగణనపై సలు సూచనలు చేస్తూ మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించింది. రాబోయే రోజుల్లో జనగణన ఆధారంగానే రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు సహా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుంది. ఈ కారణంగానే అన్ని రాష్ట్రాల కూడా జనగణన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తాయి.
అభ్యంతరాల మధ్య ఏర్పాటు…

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయంగా అన్ని పార్టీలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేతలు కూడా విభజన విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పలువురు తమ అభ్యంతరాలు తెలుపుతూ మున్సిపల్ అధికారులకు విజ్ఙప్తి చేశారు. ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణాలోకి తీసుకని విభజన నిర్ణయం తీసుకుందని అధికారులు ప్రకటించారు. అనంతరం కొత్త కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాగాన్ని సమాయాత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ జనగణన నిబంధనలకు వ్యతిరేకమని బీజేపీ నేత గురువారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నిర్ణయంపై మూడు వారాల గుడువు ఇస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. జనగణన సందర్భంగా అమలు చేసే నిబందనలను కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా అమలు చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడంతో మూడు కార్పోరేషన్ల ఏర్పాటు నిర్ణయం ఎలాంటి పరిస్తితులకు దారి తీస్తోందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం…
పరిపాలనా పరంగా పునర్వ్యవస్థీకరణ తప్పదని భావిస్తో, డిసెంబర్ 31, 2025 కి ముందు పూర్తి చేసుకోవాలి లేదంటే మార్చి 2027 తరువాత అమలు చేయాలన్న స్పష్టమైన వాదనలను పిటీషనర్ తరపు న్యాయ వాది వినిపించారు. జనాభా గణన కార్యకలాపాలకు గరిష్టంగా అంతరాయం కలిగించే సమయంలో పునర్వ్యవస్థీకరణను అమలు చేయాలని ఎంచుకోవడం పూర్తిగా అభ్యంతర కరమని తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలను విన్న మూడు వారాల వ్యవధిలో వారి సంబంధిత కౌంటర్లను దాఖలు చేయాలని ఆదేశించింది.








Leave a Reply