క్రికెట్ అభిమానులకు పండగే
(స్పోర్ట్స్ డెస్క, న్యూస్ఇన్)
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతి అందుబాటులోకి రానుంది. కీలకమైన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోట్లాది మంది అభిమానులు వివిధ ప్లాట్ ఫాంలపై క్రికెట్ ను వీక్షిస్తూ అనందిస్తున్నారు. ఇక గూగుల్ కూడా క్రికెట్ పై ఐసీసీ తో ఒప్పందంద చేసుకున్నట్లు గూగుల్ సీఇఓ సుందర్ పిచ్చయ్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఎక్స్లో తన అభిప్రాయాన్ని క్రికెట్ భాషలోనే వెల్లడించారు. ‘ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇక.. క్రికెట్ లో ఈ నిర్ణయంతో కొత్త శకం ప్రారంభం కానుంది. ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు మ్యాచుల పై వివరాలు, విశ్లేషణలు మరింత అందుబాటులోకి రానున్నాయి.







Leave a Reply