(హైదరబాద్, న్యూస్ఇన్)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలు వేగంగా ఆచరణలోకి వస్తున్నాయి.ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాల్టీలు, కార్పోరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని తీర్మానం చేయడంతో….. వెంటనే గ్రేటర్ పాలకమండలి కూడా ఆమోదం తెలిపింది.


ఇక యుద్ద ప్రతిపాదికన 20 మున్సిపాల్టీలు,7 కార్పోరేషన్లు వివిధ జోన్ల పరిధిలోకి తెస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా వెలువరించింది.
చార్మినార్ జోన్ పరిధిలోఇక ఐదు, శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఐదు మున్సిపాల్టీలు, ఎల్బీ నగర్ జోన్ లోకి 7 మున్సిపాల్టీలను విలీనం చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కూకల్ పల్లి జోన్లలో 4,6 మున్సిపాల్టీ లను విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ జోన్ల పరిదిలోకి వచ్చిన మున్సిపాల్టీలు ఇలా ఉన్నాయి.
చార్మినార్ జోన్…..
ఆదిభట్ల
బడంగ్ పేట్
జల్ పల్లి
శంషాబాద్
తుర్కయాంజాల్.
శేరిలింగంపల్లి జోన్…..
బండ్లగూడ జాగీర్
మణికొండ
నార్సింగి
అమీన్ పూర్
తెల్లాపూర్
ఎల్ బీ నగర్ జోన్…..
మీర్ పేట్
పెద్ద అంబర్ పేట
తుక్కుగూడ
దమ్మాయిగూడ
ఘట్ కేసర్
పీర్జాదిగూడ
పోచారం
సికింద్రాబాద్ జోన్…..
బోడుప్పల్
జవహర్ నగర్
నాగారం
తూంకుంట
కూకట్ పల్లి జోన్……
దుండిగల్
గుండ్లపోచంపల్లి
కొంపల్లి
మేడ్చల్
నిజాంపేట్
బొల్లారం



Leave a Reply