(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను అమలు చేసి ఓటర్ల జాబితాను లోటు పాట్లు లేకుండా రూపొందించాలని ఎన్నికల కమీషన్ వేగంగా అడుగులు వేస్తోంది. పలు రాష్ట్రాల్లో వివాదాలకు దారి తీసిన SIR ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రా ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేస్తూ సమాచారం అందించింది. SIR ను అమలు చేసేందుకు అవమైన అన్ని సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు అరుణా చల్ ప్రదేశ్,చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో SIR అమలు చేయనుంది. దీంతో దాదాపు దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. అయితే ఇప్పటికీ ఈ వివాదం పశ్చిమ బెంగాల్ సహా బీహార్ వంటి రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర దూమారం రేపింది. హైదరాబాద్ లో ఈ విధానం అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు వ్యవహరించే తీరుతో ఇక్కడా వివాదాలు రేగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికేతరులు ఎంతో మంది అక్రమంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. SIR అమలు వివాదానికి తీరే అవకాశం ఉంది. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు SIR అమలు పై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.






Leave a Reply