(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో స్థానిక జట్టు భారీ స్కోరు సాధించినా…ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశ పరిచారు. యదావిధిగా మొదటి బంతికే పెవీలియన్ చేరుకున్నారు.నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ ఆర్ హెచ్ 216 పరుగులు సాధించింది. ఆర్ ఆర్ కు 217 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ లు జట్టు స్కోరు బాధ్యతలను తీసుకున్నారు. ఇషాన్ కిషన్ ఆర్ఆర్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశారు. పరుగుల ఖాతా తెరవకుండానే అభిషేక్ వేనుదిరిగినా…. కిషన్, హెడ్ లు ఆర్ ఆర్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీలు, సిక్స్ లతో విరుచుకు పడ్డారు. 7 ఓవర్లలో 55 పరుగులు సాధించిన ఎస్ఆర్ హెచ్ మరో హెడ్ వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లలో కిషన్ దూకుడుకు జట్టు స్కోరు భారీగా పెరిగింది.13.2 ఓవర్లలో జట్టు స్కోరు 143 పరుగులకు చేరుకుంది.కిషన్- హెన్రెచ్ క్లాసిన్ ల భాగస్వామ్యం ఆర్ ఆర్ జట్టులో ఆందోళన రేపింది.కిషన్ 44 బంతుల్లో 6 సిక్స్ లు, 8 ఫోర్లతో 91 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యరు.

ఆతరువాత క్లాసిన్ కూడా 26 బాల్స్ ఎదుర్కొని 40 పరుగులు చేసి వెనుదిరిగారు.16 ఓవర్లలో 162 పరుగులు చేసి నాలుగు వికెట్లు ఎస్ ఆర్ హెచ్ కోల్పోయింది. క్లాసిన్ ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టారు. నితీష్ కుమార్ రెడ్డి – సలీల్ అరోరాల భాగస్వామ్యం తో జట్టు స్కోరు పెరిగింది. నితీష్ స్థానిక గ్రౌండ్ లో చెలరేగారు భారీ సిక్స్ లో కొట్టి అభిమానులను అలరించారు. 13 బాల్స్ లు ఎదుర్కొని 4 సిక్స్ ల సహాయంతో 28 పరుగులు చేశారు. దీంతో జట్టు స్కోరు 18వ ఓవర్లో 200 పరుగులు దాటింది. ఆర్చర్, సందీప్ శర్మ, తేషార్ దేశపాండే,రియాన్ పరాగ్ లు తలో వికెట్ తీసుకున్నారు.












Leave a Reply