NewsInn

News in a Click

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

ప్రపంచంలో రకరకాల వింతలు జరుగుతుంటాయి. బ్రహ్మంగారి కాజ్ఞానం గురించి ఎంతోకొంత అందరికీ తెలిసే ఉంటుంది. వందల ఏళ్ల క్రితం బ్మహ్మంగారు జరగబోయేదానిని ముందు ఊహించి కాలజ్ఞానంగా బోధించారు. ఈ క్రమంలో అనేక వింత సంఘటనలు మనం చూశాం. తాజాగా ఓ శిశువు పుడుతూనే నోటిలో పళ్లతో పుట్టింది. ఈ చిన్నారిని చూసిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టే జరుతుతుంది అంటున్నారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డకు నోటిలో పళ్లు ఉండవు. పుట్టిన 6 మాసాల తర్వాత పిల్లల్లో పళ్లు వస్తాయి. అప్పటిరకూ పళ్లు వారి చిగుళ్లల్లో అంతర్గతంగా దాగి ఉంటాయి. క్రమంగా అవి రూపుదిద్దుకొని శిశువుకు ఆరేళ్ళ వయసు వచ్చేసరికి కొంచెం కొంచెంగా పైకి పెరుగుతూ వస్తాయి. కానీ అరుదుగా శిశువుల్లో పుట్టిన వెంటనే ఒకటి లేదా రెండు పళ్ళు కనిపిస్తే వాటిని నాటల్ టీత్ అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. లక్షమంది పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు . ఈ నాటల్ టీత్ వల్ల పిల్లలు తల్లి పాలు తాగటానికి ఇబ్బంది అవుతుంది. తల్లి పాలిచ్చే సమయంలో ఆమె నొప్పిభరించాల్సి ఉంటుంది. జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరిగుతుంది కాబట్టి అది ఊడిపోయి శిశువుకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా వుంది. ఐతే తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతంలో జరిగింది. దుర్గ అనే మహిళకు జన్మించిన శిశువుకు ఇలా పుట్టినవెంటనే కింద చిగురులో పన్ను కనిపించింది. పుట్టిన 6 రోజుల పసికందుకు స్థానిక దంత వైద్య నిపుణుడు సర్జరీ చేసి పాల దంతాన్ని తొలగించారు. పన్ను కోలగా ఉందని దీన్ని జాగ్రత్త గా తొలగించినట్లు వైద్యుడు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *