మ్యాచ్ చూసేందుకు వచ్చిన రాహుల్
మెస్సితో పాటు గ్రౌండ్లో రాహుల్ గాంధీ సందడి
అపర్ణ మెస్సి టీం ను ఓడించిన ఆర్.ఆర్ 9
(హైదరాబాద్, న్యూస్ఇన్)
దాదాపు 20 రోజులుగా కొనసాగుతూ వస్తున్న మెస్సి మ్యాచ్ సజావుగా పూర్తి కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు ముందు మెస్సి కోల్ కత్తా లో పర్యటించారు.
కోల్కతాలో తన నిలువెత్తు 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మెస్సీ శనివారం సహచరులు సూరెజ్, రొడ్రిగో డిపాల్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.అక్కడ ఫుట్ బాల్ అభిమానులకు మెస్సి కనిపించకుండానే కార్యక్రమం పూర్తి కావడంతో…. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

స్టేడియంలో అభిమానులు చేసిన ఆందోళన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. మెస్సి బస చేసిన ఫలక్ నమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మెస్సిని భారీ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి పోలీసులు అనుమతించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెస్సి ఫుట్ బాల్ టీమ్ ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన RR – 9 సీఎం కొట్టిన పెనాల్టీ షట్ అవుట్
గోల్ తో విజయం సాధించింది.

స్టేడియంలో సందడి చేసిన మెస్సి విజయం సాధించిన ఆర్ఆర్ టీంకు ట్రోఫీ బహుకరించారు. ఈ సందర్భంగా స్టేడియంలో మెస్సి,మెస్సి అంటూ అభిమానులు చేసిన నినాదాలతో స్టేడియం హోరెత్తింది.ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిమానులను మెస్సి ఉర్రూతలూగించాడు. ఇక్కడ జరిగే ఫుట్ బాల్ మ్యాచ్లో మెస్సి తాను ధరించే 10వ నంబర్ జెర్సీతో గ్రౌండ్లో అడుగుపెడతారని అంతా భావించినా…. సాదాసీదాగా తన అనుచరులతో కలిసి గ్రౌండ్ లోకి వచ్చారు.

ఆద్యంతం నవ్వుతూ, ఉత్సాహంగా సందడి చేశాడీ సాకర్ మాంత్రికుడు. చిన్నారులతో కొద్దిసేపు ఫుట్ బాల్ తో ఆడుతూ వారిలో ఉత్సాహం నింపారు. స్టేడియం లోకి వచ్చిన క్రీడాకారులకు మెస్సి షేక్ హ్యాండ్ ఇచ్చారు.అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో మట్లాడుతూ……

ప్రతిఒక్కరికి హలో.. ….ఈరోజు నాకోసం ఇక్కడి వచ్చినందుకు.. నాకు గొప్పగా స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి రావడానికి ముందు నేను చాలా విషయాలు చూశాను. మీరు నాపై చూపిన ప్రేమాభిమానులు చిరకాలం గుర్తుండి పోతాయన్నారు.
ఈ మ్యాచ్ ను చూసేందుకు లోకసభలో విపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. మ్యాచ్ కు ముందు, అనంతరం మెస్సితో రాహుల్ కలియ తిరిగారు. స్టేడియంలో మెస్సి, రాహుల్ లు అతిథులుగా ఎంట్రీ ఇవ్వగా రేవంత్ క్రీడాకారుడిగా స్టేడియంలోకి ఎంటర్ అయ్యారు.

స్టేడియం లోకి వస్తున్న రేవంత్ రెడ్డి

భారీ బందోబస్తు….
బిసి పర్యటన సందర్భంగా నాలుగైదు రోజుల ముందు నుంచి పోలీసులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిజిపి శివధర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి భద్రతపై పోలీసులకు సూచనలు ఇచ్చారు. మెస్సి బస చేసిన హోటల్ తో పాటు ఉప్పల్ స్టేడియంలో భద్రత చర్యలను డిజిపి ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ వచ్చారు. దాదాపు 3,000 మంది పోలీసులను మెస్సి భద్రత కోసం వినియోగించారు. జెట్ ప్లస్ కేటగిరి భద్రతతో మెస్సి పాల్గొని కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు…. మెస్సిపోయేటరు విజయవంతం చేసిన పోలీసులకు డిజిపి ధన్యవాదాలు తెలిపారు… అయితే కొన్నిచోట్ల పోలీసులు అత్యుత్సాహం చూపి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.






Leave a Reply