NewsInn

News in a Click

యుద్ధం ప్ర‌భావం TRP రేటింగ్స్ నిలిపి వేయండి

  • స‌మాచార శాఖ ఆదేశం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఇజ్రాయెల్, ఆమెరికా –ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కొన్ని న్యూస్ టీవీ ఛానళ్లలో అవసరానికి మించిన సంచలనాత్మక కథనాలు, ఊహాగానాల ఆధారిత కంటెంట్ ప్రసారం అవుతున్నట్లు మంత్రిత్వ శాఖ గమనించింది. ఇది ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారికి లేదా అక్కడ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్న ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని పేర్కొంది.

టెలివిజన్ రేటింగ్ పాయింట్లు విడుదల చేసే సంస్థ (Broadcast Audience Research Council) కు న్యూస్ టీవీ ఛానళ్లకు సంబంధించిన TRP లను తక్షణమే నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్ర‌తి గురువారం బార్క్ రేటింగ్ ఇస్తుంది. ఇక పై త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు బార్క్ ఏ టీవీ చాన‌ళ్ల‌కు ఇచ్చే రేటింగ్ ను అధికారికంగా వెల్ల‌డించ‌రాద‌ని కేంద్రం ఆదేశించింది. రేటింగ్ పెంచుకునేందుకు కొన్ని టీవీ చానళ్లు ఇచ్చే స‌మాచారం ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేపుతోంద‌న్న అనుమానాల‌ను కేంద్రం వ్య‌క్తం చేసింది. ఇక బార్క్ రేటింగ్ ఆగిపోవ‌డంతో టీవీ చాన‌ళ్ల‌కు కేంద్రం యుద్ధం వార్త‌ల క‌వ‌రెజీ విష‌యంలో ముకు తాడు వేసిన‌ట్ల‌యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *