NewsInn

News in a Click

విక‌సిత్ భార‌త్ లో VB G RAM G కీల‌కం

విక‌సిత్ భార‌త్ లో VB G RAM G కీల‌కం

పంచాయ‌తీల‌కు కీల‌క బాధ్య‌త‌లు

పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీఠ‌

దీర్ఘ కాలిక ప్ర‌యోజ‌న‌లే ల‌క్ష్యం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

కేంద్ర ప్ర‌భుత్వం విక‌సిత్ భార‌త్ నినాదాన్ని తీసుకుని 2047 వ‌ర‌కు దేశ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాల‌న్న ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తోంది.అందులో భాగంగా VB G RAM G లో మార్పులు చేసింది. ఈ బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం తెల‌ప‌డంతో గ్రామ స్థాయి నుంచి ఒకే ఎజెండా ను జాతీయ స్థాయిలో అమ‌లు చేసేందుకు రెడీ అవుతోంది.అందులో భాగంగా ఈ ప‌థ‌కంపై పీఐబి అవ‌గాహ‌న స‌ద‌స్స‌ను ఏర్పాటు చేసింది.ప‌థ‌కం ల‌క్ష్యం, సాంకేతిక అంశాలు, మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ప‌థ‌కంలో మార్పులు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఐకార్ లో జ‌రిగిన అవ‌గాహ‌న స‌ద‌స్సులో NIRD DG న‌రేంద్ర కుమార్ మాట్లాడుతూ ప‌థ‌కం ల‌క్ష్యాల‌ను వివ‌రించారు.

విక‌సిత్ భార‌త్ లో భాగంగా గ్రామాలు, బ్లాక్ లు, జిల్లాల వారిగే ఒకే న‌మూనాతో అభివృద్ధి ప్రణాళిక‌ల‌ను గ్రామ‌స్థాయి నుంచి ఉపాధి క‌ల్పిస్తూ అమ‌లు చేయ‌డ‌మే ప‌థ‌కం ల‌క్ష్యం అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ గ్రామానికి ఆ గ్రామం త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ల‌క్ష్యాలు నిర్ణ‌యించుకునేద‌ని ఈప‌థ‌కంలో గ్రామాల్లో ప్ర‌ధానంగా మౌలిక వ‌స‌తుల క‌ల్పిన‌పై దృష్టి సారిస్తూ ఆ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని అన్ని గ్రామాల్లో ఖ‌చ్చితంగా మౌలిక వ‌స‌తుల‌కు లోటు ఉండ‌కుండా ప్ర‌భుత్వం చ‌ట్టం చేసింద‌ని చెప్పారు. తద్వారా గ్రామాల అభివృద్ధి ప్ర‌ణాళికా బ‌ద్ధంగా జరిగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఈ చ‌ట్టంలో నాలుగు కీల‌క అంశాల ఆధారంగా ఉపాధి క‌ల్పిస్తూ వ‌స‌తులు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యింద‌న్నారు. జ‌ల‌సంరక్షణ‌( నీటి సంబంధిత ప‌నుల‌న్నీ) గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు ( క‌మ్యూనిటీ సెంట‌ర్, అంగ‌న్ వాడి కేందం లాంటివి)చ వాత‌వ‌ర‌ణ ఘ‌ట‌న‌లు ( తుఫాన్,భారీ వ‌ర్షం,చ‌లి ) వంటి వి తీవ్ర రూపం దాలిస్తే ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకునే అంశాల‌తో పాటు జీవ‌నోపాధి కోసం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ప‌థ‌కం ప్ర‌ధాన ల‌క్ష్యాల‌ని చెప్పారు. వీటి ఆధారంగానే గ్రామ పంచాయ‌తీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేలా ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని రూపొందించింద‌ని NIRD DG న‌రేంద్ర కుమార్ చెప్పారు. కేంద్రం సూచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నులు చేప‌డితే గ్రామాలు స‌మ్మిళితంగా వికేంద్రీక‌ర‌ణ‌తో అభివృద్ధి చెందుతాయ‌న్నారు. నాలుగు ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ప్రణాళిక‌ల‌ను రూపొందించ‌డం, అమ‌లు చేయ‌డం, ఆర్ధిక వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చ‌కోవ‌డం వంటి కీల‌క అంశాలపై ప్ర‌భుత్వం సూచ‌న‌లు చేసింద‌న్నారు.గ‌తంలో ప‌థ‌కంలో భాగంగా ఇచ్చిన క‌నీస వేత‌నాల‌కు త‌గ్గ‌కుండా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ట్టం చేసింద‌ని అన్నారు.

న‌రేగా ను కేంద్రం ఆధునీక‌రించింది…..

మ‌రో అధికార స‌త్య‌పాల‌న్ మాట్లాడుతూ న‌రేగా ప‌థ‌కానికి ఆధునిక‌త జోడించి కొత్త‌గా ఈ ప‌థ‌కాన్ని అమలు చేసే విధంగా VB G RAM G ప‌థ‌కానికి కేంద్రం మార్పులు చేసంద‌నిచెప్పారు. గ‌తంలో వంద రోజుల ప‌నిదినాలు ఉంటే ఇప్పుడు 125రోజుల ప‌నిదినాల‌ను ప్ర‌భుత్వం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. పెరిగిన ఆధునిక‌త‌తో పారద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీఠ వేసింద‌న్నారు. దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు,శాశ్విత ఉప‌యోగాలు అన్న ల‌క్ష్యంగా ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌న్నారు. ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డంలో పంచాయ‌తీల‌దే కీల‌క పాత్ర అన్నారు. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక ప‌రిజ్ఙానంతో బ‌యోమెట్రిక్, జియో ట్యాగింగ్, రియ‌ల్ టైండ్యాష్ బోర్డుల‌ను జోడించి ప‌క‌డ్భంధీగా ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం అన్నిచ‌ర్య‌లు తీసుకుంద‌ని చెప్పారు. న‌రేగ‌ప‌థ‌కంలో అమ‌లు చేసిన ఈ విధానాల‌ను తొల‌గించ‌లేద‌ని 20 ఏళ్ల త‌రువాత ఆధునీకరించి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని కేంద్రం ప‌థ‌కంలో మార్పులు చేసింద‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *