(న్యూస్ఇన్, బెంగుళూరు)
తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల సాగునీటి సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న ధీమా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఈ రోజు చరిత్రలో నిలిచి పోతుందని, కేవలం ఇది గేట్ల పునరుద్ధరణ కాదని మూడు తరాల సమస్యకు పరిష్కారం లభించినట్లయిందన్నారు. లక్షలాది మంది రైతుల సమస్య కొత్త గేట్ల భిగింపుతో ముగిసిందన్నారు. పాలమూరు జిల్లాలో రాజోలిబండ డైవర్షన్ స్కీం కు కేటాయించిన 17.9 టీఎంసీల నీళ్లలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటోందన్నారు. మరో 10 టీఎంసీ ల నీరు గద్వాల, అలంపూర్ ప్రాంత రైతులకు దక్కాల్సిన అవసరం ఉదన్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రితో జరిగిన చర్చల్లో తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి కేటాయింపుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని సీఎం చెప్పారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సమావేశంలో నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నదీ ఒడ్డున జరిగిన చర్చలు గొప్ప నిర్ణయంగా మారబోతోందన్నారు. ఈ చర్చలు అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపుతుందని నమ్ముతున్నానన్నారు.రైతులకోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు నడవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.











Leave a Reply