NewsInn

News in a Click

సీఎం మధిర సభ రద్దు – హైదరాబాదులోనే సదస్సు

సీఎం మధిర సభ రద్దు – హైదరాబాదులోనే సదస్సు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించ తలపెట్టిన సభను రద్దు చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *