(హైదరాబాద్,న్యూస్ ఇన్)
తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని,అనుకోకుండా జరిగిన పరిణామాలు రాజకీయాల్లోకి తెచ్చాయని బిజెపి జాతియ అధ్యక్షుడు నితిన్ నబిన్ వెల్లడించారు. నా తండ్రి మరణం తర్వాత అనుకోకుండా నేను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. రాజకీయ జీవిత ప్రారంభ దశలో నేను కూడా ఎలా ముందుకు సాగాలి అనే సందేహాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. కాలక్రమేణా నేను ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను.. జీవితంలో షార్ట్కట్స్ అనేవి ఉండవు. జీవితం వేగాన్ని పరీక్షించే పోటీ కాదు. అది సహనాన్ని పరీక్షించే ప్రయాణం అని విద్యార్థులతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వికసిత్ భారత్ పేరుతో నిర్వహించిన స్టూడెంట్స్ కంక్లేవ్ లో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానాలు ఇచ్చారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎలాంటి అసాధారణమైన పని చేయలేదు, ప్రత్యేకంగా ఏదీ చేయలేనీ, కేవలం నిబద్ధతతో, నిజాయితీతో, నిరంతర కృషితో నా బాధ్యతలను నిర్వర్తించిన్నట్లు విద్యార్థులతో చెప్పారు. ఒక సాధారణ సభ్యుడిగా ప్రారంభమై, అధ్యక్షుడి స్థాయికి చేరిన నా ప్రయాణం నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది.. మీరు మీ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తే, పార్టీ మీ కృషిని తప్పనిసరిగా గుర్తిస్తుందన్నారు.
ఒత్తిడి వల్ల మనం నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మీపై, మీరు ఎంచుకున్న మార్గంపై విశ్వాసం కలిగి ఉండటం అత్యంత ముఖ్య మైన విషయమని చెప్పారు.
ఇవి రాజకీయాలకు మాత్రమే పరిమితం కావని, జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఇవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
గతంలో కొందరు రాజకీయ నాయకులు ఎన్నికలను ఒక తాత్కాలిక అవకాశంగా మాత్రమే చూసేవారు. ఓట్లు సాధించేందుకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చేవారు. కానీ భారతీయ జనతా పార్టీ అలాంటిది కాదు. మేము సాధించగలిగిన వాటినే హామీ ఇస్తాము. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సంపూర్ణ నిబద్ధతతో పని చేస్తాము.

అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురించి, వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ దృక్పథం ఖాళీ హామీలపై కాదు.. బాధ్యత, ఫలితాల సాధన, మరియు దీర్ఘకాల దూరదృష్టిపై ఆధారపడి ఉంది.జెన్ జెడ్ (Gen Z) నిజంగా ఏమి కోరుకుంటున్నారో ఎవరూ అడగడం లేదు. ఇతర దేశాల్లోని ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని దేశంలోని యువతను కొన్ని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని నితిన్ ఆరోపించారు. దేశంలోని నిజమైన zen Zఅయితే అభివృద్ధికి, ఆవిష్కరణలకు మరియు భవిష్యత్తుపై ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని నితిన్ ప్రస్తావించారు. గతంలో కాశ్మీర్ యువత హింస మార్గంతో ముడిపడి ఉండేది. కానీ మోదీ హయాంలో, కాశ్మీర్ యువత విద్య, క్రీడలు మరియు జాతీయ సేవలో ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.











Leave a Reply