(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుసరిస్తున్న విధానం పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంటి పంచాయతీలో తలసాని తల దూర్చి రాజకీయంగా విమర్శలు చేయడం తగదని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నీ గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తులేమా అని ప్రశ్నించారు. ఆరోజు నేను బండబూతులు తిడితే యాదవ కులం గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై కుల సంఘాన్ని అడ్డుపెట్టుకుని తలసాని వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఆరోజు లేని యాదవ కులం ఈరోజు తెరపై ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి…

తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు, డీలిమిటేషన్ జరిగితే 20 ఎంపీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.ఎంపీల ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసినట్టు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ నేతలు ఎంపీల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాను. ప్రతిపాదనను ఏఐసీసీ ఇన్చార్జ్ నటరాజన్ సమక్షంలో పంచుకున్నట్లు వెల్లడించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఈ లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో నెలకొన్న రెండు కీలక వివాదాలపై నివేదికను త్వరగా సమర్పించాలని ఇన్చార్జ్ ఆదేశించినట్లు తెలిపారు.
పెండింగ్లో ఉన్న నివేదికలను ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేసి సమర్పిస్తాను











Leave a Reply