NewsInn

News in a Click

శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలలో గవర్నర్

శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలలో గవర్నర్

(న్యూస్ఇన్,హైదరాబాద్)

చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం సాయంత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారిని, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారిని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *