NewsInn

News in a Click

సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…!

సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…!

(న్యూస్ఇన్, హైదరాబాద్)

ప్రభుత్వ పాలన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
వారసత్వంగా వచ్చిన అప్పులు, సంక్షేమ పథకాలు, మరియు అభివృద్ధిపై శాసనసభ వేదికగా చర్చిద్దాం రండి అని సీఎం రేవంత్ రెడ్డి మరో సారి సవాల్ చేశారు. వరంగల్ జిల్లా ములుగు, పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కేసీఆర్ లాంటి నేతలు 100 మంది వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు అని సీఎం వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను టిఆర్ఎస్ రెచ్చగొట్టే ఫోటోలు చేస్తుందని సీఎం ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు అమలు చేస్తున్నాము అసెంబ్లీ సాక్షిగా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారిగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు.
రైతులు, ఆడిబిడ్డలు, నిరుద్యోగ యువకుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సమయంలో యువకులు సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.
రాష్ట్రంలో అప్పుల భారం మోస్తూనే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. బోల్తా కొట్టిన బండిని పట్టాలెక్కించామని, ఇక పరుగెత్తించడమే మిగిలిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *