(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశవ్యాప్తంగా ఆదివారం వైద్య విద్యలో ప్రవేశం కోసం కీలకమైన జాతీయ స్థాయిలో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో వైద్య విద్యలో అడ్మిషన్లు ఈ పరీక్ష ఆధారంగానే జరుగుతాయి. తెలంగాణాలో 24 జిల్లాలో 199 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రం నుంచి 73, 084 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు 5 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అరంగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష విధానం….
పెన్ & పేపర్ (ఓఎంఆర్ షీట్) పద్ధతిలో పరీక్ష
మొత్తం 180 ప్రశ్నలు – అన్నింటికీ సమాధానం ఇవ్వాలి
సరైన జవాబుకు 4 మార్కులు, ❌ తప్పు జవాబుకు -1 మార్క్
మొత్తం మార్కులు 720
ఫిజిక్స్ – 45, కెమిస్ట్రీ – 45, బయాలజీ – 90 ప్రశ్నలు

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు…..
అన్ని కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్
జామర్లు ఏర్పాటు – మాల్ప్రాక్టీస్కు అడ్డుకట్ట
ప్రతి కేంద్రం వద్ద పోలీసు భద్రత, డ్యూయల్ లేయర్ తనిఖీలు
ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరిచే విధానం పోలీసు పర్యవేక్షణలో
జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ల ఏర్పాటు
నిర్వహణ ఏర్పాట్లు…..
రాష్ట్ర ప్రభుత్వం – ఎన్టీఏ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షణ
కేంద్రాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఏర్పాటు
అభ్యర్థులకు సూచనలు……
అడ్మిట్ కార్డు (3 పేజీలు) తప్పనిసరి
పారదర్శక వాటర్ బాటిల్ మాత్రమే అనుమతి
డ్రెస్ కోడ్ కచ్చితంగా పాటించాలి








Leave a Reply