(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో అధికార ప్రతిపక్ఫ పార్టీలు క్షేత్ర స్థాయిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పట్టు కోసం పావులు కదుపుతున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో 20వ తేదీ ఒక ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిదంటూ కాంగ్రెస్ బీఆర్ ఎస్ పై విమర్శలు మొదలు పెట్టింది.ఎన్నికల్లో ఇది కూడా ఓ ప్రధాన అంశంగా మారింది. అధికార పార్టీకి ఈ వ్యవహారం ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు కలిసి వచ్చిన అస్త్రంగా వాడుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోభాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, బ్యారేజీల కూడా అదే గాడిన కట్టింది. నాణ్యత లేకపోవడంతోనే ఈ నిర్మాణాలు ప్రశ్నార్ధకంగా మారాయన్న ఆరోపణలను తీవ్రం చేసింది. మేడి గడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై దాదాపు రెండున్నరేళ్లుగా విమర్శలు రేగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేసి వినియోగం లోకి తేవాలని బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తోంది. భారీ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వం కుట్రతో మరమ్మత్తులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్న వాదనను బీఆర్ఎస్ వినిపిస్తోంది.
సీఎం రేవంత్ మేడిగడ్డ టూర్…..

రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత కూడా ఈ వ్యవహారం తీవ్ర వివాదస్పదంగా మారింది అవినీతి, అక్రమాలు, విచారణలు అంటూ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే… ఇప్పటి వరకు ప్రాజెక్టు మరమ్మత్తు పనులకు ఇప్పటి వరకు పెద్దగా ఆసక్తి చూపక పోయినా…… తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అధికార పక్షం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడి గడ్డకు మరమ్మత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయాలతో నిర్మించినీ ప్రాజెక్టును ఎలా వృధాగా ఉంచుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఇక మేడి గడ్డ కు మరమ్మతు పనులను చేపడుతామన్న సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రాజెక్టు సందర్శనకు వెళుతారని సచివాలయ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది. ఈ నెల 20వ తేదీన మేడిగడ్డను సీఏం సందర్శించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఉత్తర తెలంగాణా జిల్లాల నుంచి తెలంగాణా రాజకీయం మరింత రంజుగా మారనుంది.
బీఆర్ ఎస్ జైత్ర యాత్ర……

ఎందకంటే ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ జైత్ర యాత్ర జగిత్యాల నుంచి మొదలు కానుందని బీఆర్ ఎస్ నేతలు ప్రచారం మొదలు పెట్టారు. సుదీర్ఘ విరామం తరువాత మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతలు కేటిఆర్, హరీష్ రావ్ లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నా…కేసీఆర్ సభకు హాజరవుతండండం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దాదాపు రెండున్నరేళ్లు కాలం పూర్తి కావడంతో…కేసీఆర్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ వైఫల్యాలను కేసీఆర్ ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే చాన్స్ ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను జగిత్యాల నుంచి ఎత్తి చూపుతారని గులాబీ నేతలు అంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను కూడా కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో పార్లమెంట్ నియోజకవర్గాల్లో దక్ఇణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ కేంద్రంపై ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తి రేపుతోంది.
పొలిటికల్ వార్…..
అయితే ఒకే రోజు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లు కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తుండడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అయితే సీఎం పర్యటనపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని సీఏంఓ వెల్లడించలేదు.కానీ జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కరీంగనర్ జిల్లా నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు పొలిటికల్ వార్ కు తెరలేపుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.











Leave a Reply