(న్యూఢల్లీ, న్యూస్ఇన్)
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ చేసిన ప్రసంగం సభల్లో నవ్వులు పూయించింది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కోసం జరిగిన చర్చలో రాహాల్ ప్రసంగించారు. లోక్ సభలో చర్చ సీరియస్ గా జరుగుతున్న సమయంలో రాహూల్ మాట్లాడుతూ
మనం మహిళను ఒక శక్తిగా, ఒక జీవితాన్ని నడిపించే శక్తిగా చూస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరు కూడా తల్లి, సోదరి, భార్య ద్వారా ఎంతో ప్రభావితమవుతారన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. నాకు, ప్రధాని నరేంద్రమోడీ కి, భార్యల సమస్య లేదని.. వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిసాయి.
తన సోదరి, వాయ నాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తన సోదరి చేసిన ప్రసంగం ఆకట్టుకుందని చెప్పారు. నా 20 ఏళ్ల జీవితంలో చేయని పని నా సోదరి 5 నిమిషాల్లో చేశారని చెప్పుకొచ్చారు. సభలో సీరియస్ గా ఉండే అమీత్ షా కూడా ప్రియాంక చేసిన ప్రసంగానికి నవ్విన విషయాన్ని ప్రస్తావించారు. మహిళా బిల్లుపై చర్చలో భాగంగా ప్రియాం ప్రసంగిస్తే….. అమీత్ రాజకీయంగా పావులు కదిపిన తీరును ఎద్దేవా చేశారు. అమీత్ షా రాజీకీయం ముందు చాణుక్యుడి బ్రతికి ఉంటే ఆశ్చర్య పోయే వారని వ్యాఖ్యానించారు. దీంతో అమీత్ షా సహా సభ్యులంతా నవ్వుకున్నారు. ఇదే విషయాన్ని రాహూల్ ఈ రోజు మరోసారి సభలో ప్రస్తావించి సోదరిని అభినందించారు.












Leave a Reply