(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో ఏపీసీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకులను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. అమరావతిలో చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటిన్ లలో ఒక రోజు భోజనం ఖర్చును భరించారు. పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానం చేశారు. పార్టీ నేతలు , కార్యకర్తలు బాబు బర్త్ డే సందర్బంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. బాబు పుట్టిన రోజు సందర్బంగా తిరుమల, ఇంద్రకీలాద్రి దేవాలయ పూజారులు చంద్రబాబు దంతపుతలకు వేద ఆశిర్వచనాలు ఇచ్చారు.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో 76 అడుగుల చంద్రబాబు కటౌట్పై డ్రోన్ల ద్వారా పూల వర్షం. కురిపించారు. 76 కేజీల కేక్ను కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు గారి మాస్క్లను ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వందలాది బెలూన్లను ఈ సందర్భంగా గాలిలోకి ఎగురవేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జూబ్లీహిల్స్లోని టిటిడి వారి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి అనంతరం జరిగిన ర్యాలీని నిర్వహించారు.



18 శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠమైన మాతా జోగుళాంబ దేవాలయాన్ని బహుమని సుల్తానుల కాలంలో కూల్చబడింది. ఆనాటి గౌరవ భారత ప్రధాని గారితో మాట్లాడి గ్రూపు టెంపుల్స్ పథకం కింద చంద్రబాబు మంజూరు చేయించి జోగుళాంబ దేవాలయాన్ని పునర్న్మించారని బక్కని నర్సిములు గుర్తు చేశారు. బాబు ముఖ్యమంత్రిగా తెలంగాణాలో చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. చంద్రబాబు గారు చేసిన అభివద్ధి కార్యక్రమాలను సందర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీలో గెలిచి ఇతర పార్టీలలోకి నాయకులు వెళ్లినా రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు.






Leave a Reply