
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ త్రిసభ్య బృందం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం గారితో సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రలు ఆయనను కలిశారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్పై త్వరలో రానున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలతో పాటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం గారితో సుదీర్ఘంగా చర్చించారు.






Leave a Reply