
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హస్తినాపురంలో దాడులు నిర్వహించి రూ.10 లక్షల విలువైన 361 ప్రీమియం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి (48) బెంగళూరు, హర్యానా డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి మద్యం తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం మేరకు ఎస్. జీవన్ కిరణ్ నేతృత్వంలోని బృందం మంగళవారం తెల్లవారుజామున శ్రీరమణ కాలనీ ఫేజ్-2లో దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకుంది. అయితే నిందితుడు పరారయ్యాడు. ఈ దాడిలో పాల్గొన్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.






Leave a Reply