
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్ట వద్దన్న హైకోర్టు ఆదేశించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించ లేదను హైకోర్టు అభిప్రాయపడింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోసం ఈ కమిషన్ ను నియమించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీశ్ రావులు హై కోర్టును ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పొలిటికల్ వార్ కు హై కోర్టు తీర్పు పులిస్టాప్ పెట్టినట్లయింది. రాజకీ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీఆర్ ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో గులాబీ పార్టీకి పెద్ద ఊరటనిచ్చింది.
కోర్టు తీర్పు పై హరీశ్ రావు …
సత్యమేవ జయతే..
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది.
ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎవరు ఔనన్నా కాదన్నా….
ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..
జై తెలంగాణ
జై కెసిఆర్





Leave a Reply