NewsInn

News in a Click

కాళేశ్వ‌రం కేసులో సుప్రీం కోర్టుకు స‌ర్కార్

కాళేశ్వ‌రం కేసులో సుప్రీం కోర్టుకు స‌ర్కార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతిపై ప్ర‌భుత్వం నియ‌మించిన పీసీ హోష్ క‌మిష‌న్ నివేదిక‌పై హై కోర్టులో ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ తగ‌ల‌డంతో సుప్రీం కు వెళ్లే యోచ‌న‌లో ఉంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రిగింద‌ని, ఈ కార‌ణంగానే నిర్మాణంలో నాణ్యత లోపించింద‌ని అధికార పార్టీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పీసీ ఘోష్ క‌మిష‌న్ ను నియ‌మించి కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై విచార‌ణ నిర్వ‌హించింది. ఈ క‌మిష‌న్ పై బీఆర్ ఎస్ తో పాటు అప్ప‌ట్లో ఉన్న‌తాధికారులుగా ఉన్న స్మితా స‌బ‌ర్వాల్, ఎస్ కే జోషిలు కోర్టుకు వెళ్లారు. ఈ క‌మిష‌న్ నివేదిక ఆధారంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవద్ద‌ని తీర్పు ఇచ్చింది. దీంతో బీఆర్ ఎస్ కు భారీ ఊర‌ట ద‌క్కింది. అయితే ఈ విష‌యంలో ప్ర‌భుత్వం డిఫెన్స్ ప‌డిన‌ట్ల‌యింది. దీన్ని అధిగ‌మించేందుకు స‌ర్కార్ హై కోర్టు తీర్పుపై సుప్రీం కు వెళ్లేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

రేపు క్యాబినెట్ భేటీ…..

గురువారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రుగ నుంది. ఈ స‌మావేశంలో ఇది ఒక కీల‌క అంశంగా మారే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వం ఈ కేసు విష‌యంలో ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించే చాన్స్ ఉంది. హై కోర్టు తీర్పును సుప్రీంలో స‌వాల్ చేస్తూ బీఆర్ ఎస్ కీల‌క నేత‌ల‌తో పాటు సంబంధిత అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌న్న ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. హై కోర్టు తీర్పు కంటే విజిలెన్స్ విచార‌ణ‌, ఎన్డీ ఎస్ ఏ విచార‌ణ నివేదిక‌ల‌పై కూడా ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. ఆ నివేదిక‌ల ఆధారంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నే అంశంపై కూడా ప్ర‌భుత్వం సీరియ‌స్ గా దృష్టి పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ సీఎం కేసీఆర్, అప్ప‌టి ఇరిగేష‌న్ మంత్రి హ‌రీష్ రావ్ లు దోషులే అని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు.

క్లీన్ చీట్ ఇవ్వ‌లేదు…..

పీసీ ఘోష్ క‌మిష‌న్ నివ‌దేఇక‌పై హై కోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్పందించారు. హై కోర్టు ఎవ‌రికీ క్లీన్ చీట్ ఇవ్వ‌లేద‌న్నారు. తాము ఏర్పాటు చేసిన క‌మీష‌న్ ను కోర్టు స‌మ‌ర్ధించింద‌ని చెప్పారు. దీనికి తోడు త‌మ‌కు అందిన స‌మాచారం ప్రకారం కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేసిన మూడు బ్యారేజీల నిర్మాణాల్లో
లోపాలు ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *