
(హైదరాబాద్,న్యూస్ఇన్)
అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. “పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదు” అని పేర్కొంది. అయితు ఇరాన్ – ఆమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం మొదలైన నాటి నుంచి పెట్రో ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అదనపు భారం వినియోగదారులపై వేయకుండానే నిర్వహిస్తోంది. పెట్రో ఉత్పత్తుల సంస్థలకు సబ్సిడీ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కేంద్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రజలపై నేరుగా భారం వేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
నిరంతర వార్తల కోసం వాట్సప్ ఛానల్ లో చేరండి…….https://whatsapp.com/channel/0029Vb7fQokJENxuemz6EL3X
నిరంతరం వార్తల కోసం టెలిగ్రాం ఛానల్ లో చేరండి……https://t.me/+eGu5mbxS9YQwOTll



Leave a Reply