(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ చర్ల పల్లి నుంచి బయలుదేరుతుంది.ప్రస్తుతం నడుస్తున్న టైన్లకు అదనంగా ఈ వీక్లీ ట్రైన్ కూడా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రికిషన్ రెడ్డిని ఈ కొత్త ట్రైన్ ను ఆదివారం ప్రారంభించారు.

చర్లపల్లి – తిరుచానూరు (ట్రైన్ నెం. 17059): ప్రతి ఆదివారం రాత్రి 21:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.
తిరుచానూరు – చర్లపల్లి (ట్రైన్ నెం. 17060): తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం సాయంత్రం 16:00 గంటలకు తిరుచానూరులో బయలుదేరి, మంగళవారం ఉదయం 08:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ప్రధాన స్టాపింగ్లు (తెలంగాణ): ఈ రైలు తెలంగాణలో మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్నగర్, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల స్టేషన్లలో ఆగుతుంది.
ప్రధాన స్టాపింగ్లు (రాయలసీమ): ఆంధ్రప్రదేశ్లో కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్లలో ఈ రైలుకు స్టాపింగ్స్ ఉన్నాయి.
కోచ్ల వివరాలు: ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్లతో కలిపి మొత్తం 20 అత్యాధునిక కోచ్లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు లబ్ధి: కొత్తగా అభివృద్ధి చెందిన చర్లపల్లి టెర్మినల్ వల్ల సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు, తెలంగాణ, రాయలసీమ జిల్లాల భక్తులకు కనెక్టివిటీ పెరగనుంది.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఈ నూతన రెగ్యులర్ రైలు సౌకర్యాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
HYDERABAD – TIRUCHANUR TRAIN, NEW TRAIN FROM CHARLA PALLI, TO DAY STARTED CENTRAL MINISTER KISHAN REDDY,





Leave a Reply