NewsInn

News in a Click

న‌ర్సంపేట‌లో హై అలెర్ట్- మాజీ ఎమ్మెల్యే అరెస్టు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆర్టీసి కార్మికుల స‌మ్మె ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. రెండో రోజైన గురువారం న‌ర్సంపేట డిపోలో డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్న శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ్య‌త్యా య‌త్నం చేసి….. రాత్రి హైద‌రాబాద్ లో మృతి చెందారు. దీంతో ఆర్టీసీ స‌మ్మె విషాదంగా మారింది. డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ‌త్య ప్ర‌భుత్వ హ‌త్య‌గానే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు బాధ్య‌త వ‌హించాల‌న్నాయి. ప్ర‌భుత్వం కూడా దీనిపై వెంట‌నే స్పందించింది. కార్మికులు అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని చెబుతూనే.. చ‌ర్చ‌కు ఆహ్వ‌నించింది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి శంక‌ర్ గౌడ్ మృత దేహాన్ని న‌ర్సంపేట‌కు త‌ర‌లించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. డ్రైవ‌ర్ మృతి కి నిర‌స‌న‌గా న‌ర్సంపేట బంద్ కు కార్మిక సంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు పిలుపునిచ్చాయి. దీంతో న‌ర్సంపేట‌లో హై అలెర్ట్ ప్రాంతంగా మారింది. రాష్ట్రంలోని అన్ని బ‌స్ డిపోల ముందు ఆర్టీసి కార్మిక సంఘాలు చేప‌ట్టిన ఆందోళ‌న‌ల‌కు బీఆర్ ఎస్, బీజేపీలు మ‌ద్ద‌తు ప్ర‌టించాయి. ఆర్టీసి కార్మికులు త‌మ ఆందోళ‌న‌ల్లో భాగంగా ఆర్టీసి డిపోల ద‌గ్గ‌ర శంక‌ర్ గౌడ్ మృతికి నివాళులు అర్పించారు. ప‌లు చోట్ల పోలీసులు ఈ కార్య‌క్ర‌మాన్ని కూడా చేయ‌కుండా అడ్డుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

ఆర్టీసి స‌మ్మె సంద‌ర్భంగా ప‌లు జిల్లాల్లో పోలీసులు అనుస‌రిస్తున్న విధానం తీవ్ర వివాదంగా మారుతోంది. ఆర్టీసి కార్మికుల స‌మాశాల నిర్వ‌హ‌ణ‌ల‌కు ఎలాంటి టెంట్లు ఇవ్వ‌రాద‌ని, స‌మావేశాల కోసం ఫంక్ష‌న్ హళ్లు కూడా అద్దెకు ఇవ్వ‌వ‌ద్ద‌ని పోలీసులు నోటీసులు జారీ చేయ‌డంపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌భుత్వం ఒక‌వైపు చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తూనే మ‌రోవైపు కార్మికుల హ‌క్కుల‌ను అణచివేసే య‌త్నం చేస్తోంద‌ని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *