(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ఉద్యమ సమయం నుంచి రెండు దశాబ్దాలకు పైగా బీఆర్ఎస్ పార్టీతో , ఆ పార్టీ అధినేతతో ఉన్న సంబంధాల్లో వచ్చిన మార్పులతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అక్కడ నాలుగేళ్లు గడవక ముందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో విజయం సాధించి….ఆ తరువాత జరిగిన 2023 ఎన్నికల్ల ఓటమి చెందిన ఈటల ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే ఆపార్టీ లో కీలక నేతలకు ఈటల రాజేందర్ కు పొసగడం లేదు ముఖ్యంగా బండి సంజయ్ , ఈటలకు పొలిటికల్ గా గ్యాప్ వచ్చింది.

ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్ లో బీసీ కోటాలో తనకు పదవి వరిస్తుందని ఈటల ఆశలు పెంచుకున్నారు. అనూహ్యంగా ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా పోయింది. దీంతో పార్టీ తీరుపై కూ అసంతృప్తితో రాజేందర్ రగిలిపోతున్నారు. పార్టీ నేతలతో సయోధ్యగా లేకపోవడం వంటి పరిణామాలతో ఒక దశలో ఈటల రాజేందర్ మళ్లీ బీఆర్ ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో…ఇప్పటికిప్పుడే ఈటల పార్టీ మారే అవకాశం దాదాపు లేదని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నచ్చకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా సైలెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా ఈటల వ్యవహారంపై పూర్తి స్థాయిలో సంస్థాగతంగా ఆరా తీసి నట్లు సమాచారం.మల్కాజిగిరిలో ఈటలకు చెక్ పెట్టాలన్న అభిప్రాయానికి బీజేపీ జాతీయ నేతలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బలమైన నేతను ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక ఎప్పటినుంచో ఆ పార్టీ నేతలకు సన్నిహితంగా ఉంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి మల్లారెడ్డి ప్రధాని మోడీని కలిసారు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రీతిరెడ్డి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి రావడం హాట్ హాట్ గా మారింది. రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ తో భేటీ అయ్యారు. వరుస భేటీలతో ప్రీతిరెడ్డి ఇక బీజేపీ నేతగా మారేందుకు ఎక్కువ సమయం తీసుకోదన్న చర్చ మొదలైంది.


బీజేపీ వ్యూహాత్మకంగానే ఈటలకు చెక్ పెట్టాలని పావులు కదుపుతుందన్న వాదనకు ఈ ఉదంతం మరింత బలం చేకూరుస్తుంది. బీసీ నినాదం…. లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ కలగలిపి ఈటలను క్రమంగా బీజేపీ దూరం పెట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ భావజాలం వల్లె వేస్తున్న ప్రీతిరెడ్డి…….
ఇప్పటీకే పార్టీలో ఒంటరైన ఈటల ….బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. బీఆర్ ఎస్ లో ఉన్నప్పుడు అక్కడా అసంతృప్తి…. బీజేపీలో చేరిన కొన్నాళ్లకే ఇక్కడా అసంతృప్తే….ఇక ఈటల రాజేందర్ రాజకీయంగా ఎక్కడ తృప్తి పొందుతారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ గా మారింది.







Leave a Reply