NewsInn

News in a Click

ఏపీలో కొన‌సాగుతున్న ఎండ‌ల తీవ్ర‌త‌

ఏపీలో కొన‌సాగుతున్న ఎండ‌ల తీవ్ర‌త‌

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో సోమవారం (27-04-26) 23 మండలాల్లో తీవ్ర, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప‌త్తుల సంస్థ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

వడగాల్పులు వీచే అవ‌కాశం ఉన్న ప్రాంతాలు….

విజయనగరం ….. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాలు;

పార్వతీపురంమన్యం ….. బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు;

అల్లూరి జిల్లా…. అనంతగిరి మండలాల్లో(23) తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

విజయనగరం 8, మన్యం 1, అల్లూరి 2, పోలవరం 7, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, మార్కాపురం 1, వైఎస్సార్ 1 మండలాల్లో (26) వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

ఆదివారం మార్కాపురం(జి) కంభంలో 44.7°C, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.1°C, వైస్సార్ కడప(జి) ఒంటిమిట్టలో 43.8°C, కర్నూలు(జి) నగరడోన, పల్నాడు(జి) గురజాలలో 43.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43.5°C, అనంతపురం(జి) భట్టువానిపల్లిలో 43.4°C, శ్రీసత్యసాయి(జి) బుక్కపట్నంలో 43.2°C, తిరుపతి(జి) బేస్తపల్లిలో 43.1°C, అన్నమయ్య(జి) నూలివీడులో 43°C, ఎన్టీఆర్(జి) చందర్లపాడు, ప్రకాశం(జి) మొగిలిచెర్లలో 42°C, అనకాపల్లి(జి) దేవరపల్లెలో 41.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకుగాను 16 జిల్లాల్లోని 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని తెలిపారు.

జాగ్ర‌త్త‌లు…….

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపిలాంటివి ధరించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు.అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *