(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ తొలిసారి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు నమోదు చేసినా…. ఆర్ ఆర్ చేతిలో ఓటమిని తప్పించుకోలేకపోయింది. రెండు ఇన్నింగ్స్ లో కూడా చివరి ఓవర్లలో బ్యాటర్లు భారీగా స్కోర్లు నమోదు చేశారు. సీజన్ మొదలైన నాటి నుంచి వరుసగా విజయాలు సాధించిన పంజాబ్ కు ఆర్ ఆర్ ఓటమి రుచి చూపించింది. ఫెరీరా 26 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేయడం, శుభం దుబే 12 బంతుల్లోనే 31 పరుగులు చేయడంతో మ్యాచ్ ఆర్ ఆర్ జట్టు సులువుగా విజయం దక్కించుకుంది. వైభవ్, జైస్వాల్ ఇన్నింగ్స్ ఆర్ ఆర్ జట్టు విజయానికి బాటలు వేసింది. ఆ తరువాత బ్యాటింగ్ లో వరుసగా వికెట్లు కోల్పోయినా…చివరికి మరోసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలదొక్కుని విజయం దక్కించుకుంది.ఆర్ ఆర్ కూడా కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ పై విజయం దక్కించుకుంది.

ఆర్ ఆర్ జట్టు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ పై సులువగా విజయం సాధించింది.పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేధించేందుకు బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు శుభారంభంతో మొదలు పెట్టింది. ఛోటా భీం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్ లోనూ తన సత్తా చాటారు. ఆర్ ఆర్ ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఖచ్చితంగా ఆర్ ఆర్ గెలుస్తుందన్న ధీమాను కల్పించారు. మొదటి ఓవర్ లో మూడు బంతులు ఆచి తూచి ఆడిన వైభవ్ ఆ తరువాత తన స్టైల్లో బ్యాటింగ్ చేశారు. అతి తక్కువ బాల్స్ మాత్రమే ఎదుర్కొని 5 సిక్స్ లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశారు. 16 బంతుల్లో పంజాబ్ బౌలర్లను బెంబేలెత్తించారు. 3.2 ఓవర్లలోనే ఆర్ ఆర్ స్కోరు 50 పరుగులు దాటింది. 51 పరుగుల వద్దర సూర్యవంశీ ఔట్ కావడంతో పంజాబ్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఎండ్ బ్యాటింగ్ చేస్తున్న యశస్వీ జైస్వాల్ భారీ రన్ రేట్ ను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ లో జోరు పెంచారు. 27 బాల్స్ ఎదుర్కొని 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 51 పరుగులు చేశారు. 105 పరుగుల వద్ద ఆర్ ఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ధృవ్ జురేల్ కేవలం 16 పరుగులు చేసి వెనుదిరిగారు. క్రీజులో నిలదొక్కున్నట్లే కనిపించిన జైస్వాల్ 123 పరుగుల స్కోరు వద్ద ఔట్ కావడంతో 11.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది. కెప్టన్ రియాన్ పరాగ్ ఐపీఎ ల్ పెద్దగా ఫాంలో లేరు. ఈ మ్యాచ్ లో కెప్టన్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం వచ్చినా…. పరాగ్ తన వికెట్ ను పారేసుకున్నారు. ఆ తరువాత క్రీజుల్లోకి వచ్చిన ఆర్ ఆర్ బ్యాటర్లు, ఫెరీరా- శుభమ్ దుబే లు మ్యాచ్ ను ఆసక్తి కరంగా మార్చారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకుని ఆర్ ఆర్ ను ఆత్మరక్షణలో వేశారు.











Leave a Reply