
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారం నచ్చకపోవడంతోనే ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు వెళుతున్నారని ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు జరుపలేదా అని ప్రశ్నించారు. అప్పుడు అది న్యాయం అయితే…ఇప్పుడు ఇది న్యాయమే అన్నారు. కేసీఆర్ నేర్పిన విద్యే ఇతర పార్టీలు అమలు చేస్తున్నాయన్నారు. పార్టీలో ఎంతో మంది నేతలకు ఆయన వ్యవహారం నచ్చడం లేదని ఆరోపించారు. టిడిపీ నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టిన కడియం శ్రీహరి బీఆర్ ఎస్ లో చేరారు. బీఆర్ ఎస్ లో ఎంపీగా గెలుపొందారు. అనంతరం కేసీఆర్ కడియం కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.







Leave a Reply