
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆర్టీసీ కార్మికులు ఇటీవల చేసిన 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు సీఎంతో భేటీ అయి తమ సమస్యలను చెబుతూనే మూడు రోజుల సమ్మె కారణంగా పడ్డ ఇబ్బందులను ప్రస్తావించారు సమ్మెపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసి కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఙతలు తెలిపారు. సమ్మె కాలానికి వేతం ఇవ్వాలని, ఆర్టీసి కార్మికులపై పలు చోట్ల కేసులు నమోదు చేశారని వాటిని ఎత్తి వేయాలని కార్మిక సంఘాలు సీఎం ను కోరడంతో సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.







Leave a Reply