(హైదరాబాద్, న్యూస్ఇన్)
ఆర్టీసి మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై అన్ని సంఘాల నాయకులు సమావేశమై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. పీఆర్సీ అంశాన్ని తాము పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ఉన్నతాధికారులతో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు, విలీనంపై ఏవిధంగా ముందుకు పోవాలనే దానిపై సంఘాల నాయకులు సమావేశమై ప్రభుత్వం ఎదుట ఆప్షన్లు ఉంచాలని సూచించారు. ఒకవేళ యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఏ యూనియన్కు ఆ యూనియన్ తమ ఆప్షన్లు ఇస్తే కామన్గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి.. భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చర్చిద్దామని సీఎం అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు………
1.సమస్యల శాశ్వత పరిష్కారానికి అంతా కలిసిరావాలని, భావోద్వేగాలు,
రాజకీయాల ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం వాటిల్లుతుంది.
2.సింగరేణి, విద్యుత్ కార్మికులతో పాటు ఆర్టీసీ కార్మికులు బలంగా కోరుకున్నందునే తాము అధికారంలోకి వచ్చాము
3.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో నియామకాలు చేపట్టడంతో పాటు బస్సుల సంఖ్యను పెంచామని, కారుణ్య నియామకాలు చేప్టటాము.
- ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గాజులరామారంలో వంద ఎకరాలు, బహదూర్గూడ లో 150 ఎకరాలు కేటాయిస్తాము
5.ఆర్టీసీలో డీజిల్కు ఏటా రూ.2 వేల కోట్లు వ్యయం చేస్తున్నారని.. ఆ వ్యయం తగ్గింపునకే తాము ఈవీల వైపు మొగ్గుచూపుతున్నాము ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ను తొలగించేది లేదు
- ఆర్టీసీ కార్మికులు, మేనేజ్మెంట్ మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలి.
7.ఆర్టీసీ సమస్యలను 100 శాతం పరిష్కరిస్తాము.. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
8.సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలి
RTC UNIONS MET CM REVANTH, CM REVANTH REDDY POSITIVE RESPOND, CM ASSURED ONE JOB WILL NOT REMOVE, WE SOLVE THE RTC STAFF ISSUES,







Leave a Reply