(తిరుమల, న్యూస్ఇన్)
సాధారణ భక్తులకు పెద్ద పీఠ వేయాలన్న లక్ష్యంగా సిఫారుసు లేఖలతో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వేసవి రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అదనపు ఈ ఓ వెంకయ్య చౌదరీ వెల్లడించారు. జూలై 15వ తేదీ వరకు విఐపీ సిఫారసు లేఖలు అంగీకరించడం లేదని వెల్లడించారు.
పారు.వీఐపీ విరామ దర్శనం కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ప్రోటోకాల్ వీఐపీల సంఖ్యను కూడా సాధ్యమైనంత తక్కువ మందికే రోజు వారి అవకాశం ఇస్తామన్నారు.టీటీడీ ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు స్వీయ-ప్రోటోకాల్ వీఐపీల కోసం వీఐపీ విరామ దర్శనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ, సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని 8నుంచి 10 గంటలకు తగ్గించే లక్ష్యంగా టీటీడీ చర్యలు తీసుకుంటుంది.భక్తులందరికీ సాధారణ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది.







Leave a Reply