NewsInn

News in a Click

హైద‌రాబాద్ రైల్వే ప్ర‌యాణికుల‌కు ఏఐ సేవ‌లు

హైద‌రాబాద్ రైల్వే ప్ర‌యాణికుల‌కు ఏఐ సేవ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కాచిగూడ‌, మ‌ల్కాజిగిరి రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్ ఏఐ-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థలను ప్ర‌వేశ పెట్టింది. భోలు మినీ, భోలు మాక్స్‌ల పేరుతో ఈ సేవ‌ల‌ను ప్ర‌వేశ పెట్టింది.భోలు ఏఐ అసిస్టెంట్లను సాఫ్ట్‌వేర్ కోడింగ్‌తో సహా హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనిరుధ్ పామర్ అభివృద్ధి చేశారు.

మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో ఏఐ ఆధారిత కియోస్క్ ‘భోలు మినీ’ దాని అధునాతన వెర్షన్ ‘భోలు మాక్స్’ను కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. క్రమబద్ధమైన వాడకం మరియు రైలు ప్రయాణికుల నుండి వచ్చే అభిప్రాయాల ఆధారంగా, ఈ వ్యవస్థలను మరింత మెరుగుపరచడానికి అవసరమైన మార్పులు చేయబడతాయి. తదనంతరం, ఈ ఏఐ-ఆధారిత ఇంటరాక్టివ్ వ్యవస్థలను జోన్ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్రవేశపెట్టడం జరుగుతుంది.

భోలు మినీ అందించే సేవ‌లు…..

వాస్తవ సమయ ప్రాతిపదికన రైలు సమాచారం, ప్లాట్‌ఫారమ్ వివరాలు మరియు స్టేషన్ సౌకర్యాలను అందిస్తుంది
సులభమైన వాయిస్ యాక్టివేషన్ (“హలో”)తో 24/7 పనిచేస్తుంది
రైల్వే డేటాబేస్‌లతో ఏఐ టెక్నాలజీని సమ్మిళితంచేస్తూ ఖ‌చ్చిత‌మైన స‌మాచారం అందించ‌నుంది.
తేలికైన, తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు స్టేషన్ల అంతటా సులభంగా అమర్చగలిగేది
ఈ వ్యవస్థ, ప్రాంతీయ భాషలో సంభాషించడానికి ఇష్టపడే ప్రయాణికులకు
ఉపయోగపడుతుంది.

భోలు మాక్స్…..

టచ్ స్క్రీన్ మరియు వాయిస్ ఆధారిత ఇంటరాక్షన్ రెండింటినీ మిళితం చేసే ఒక ఉన్నత స్థాయి ఇంటరాక్టివ్ విచారణ సహాయకుడిగా ప‌నిచేస్తోంది.
సులభమైన నావిగేషన్ కోసం 21-అంగుళాల టచ్-స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో అమర్చబడింది.
ప్రత్యక్ష రైలు ట్రాకింగ్, మార్గ నిర్దేశం మరియు స్టేషన్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల వివరాలను అందిస్తుంది.
ఆఫ్‌లైన్ డేటాబేస్ మద్దతును అందిస్తూ, నిరంతరాయంగా సేవలను అందిస్తుంది.

కొత్త‌గా అందుబాటులోకి తెచ్చిన ఈ ఏఐ సేవ‌ల ద్వారా విచారణ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించాల‌న్న ల‌క్ష్యంగా ద‌క్షిణ మ‌ద్య రైల్వే ఏర్పాటు చేసింది. ప్ర‌యోగ‌త్మ‌కంగా ప్ర‌స్తుతం ఈ రెండు స్టేష‌న్ల‌లో అమ‌లు చేస్తుండ‌డంతో మ‌రి కొద్ది రోజుల్లో ద‌క్షిణ మ‌ద్య రైల్వే ప‌రిధిలోని కీల‌క రైల్వే స్టేష‌న్ల‌లో ఏర్పాటు చేసే అంశాన్ని ద‌క్షిణ మ‌ధ్య రౌల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు ద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడంలో చొరవ చూపిన డిఆర్‌ఎం బృందాన్నిఅభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ ఆవిష్కరణల ద్వారా సేవలను ఆధునీకరించే దిశగా భోలు మినీ మరియు భోలు మ్యాక్స్‌ల ను ప్ర‌వేశ పెట్ట‌డం రైలు ప్రయాణికుల‌కు ఒక ముఖ్య‌మైన సేవ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *