NewsInn

News in a Click

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

గ‌త కొన్ని రోజులు క్రితం అత్య‌వ‌సరంగా శ‌స్త్ర చికిత్స చేసుకున్న ఆంధ్ర ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. ప‌వ‌న్ నివాసానికి చంద్ర‌బాబు వెళ్ల‌డంతో వ‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి అనా కొణిదెల‌ చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికారు. దాదాపు రెండు వారాల క్రితం అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష జ‌రుగుతున్న స‌యంలో హ‌టాత్తుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. హుటా హుటిన హైద‌రాబాద్ త‌ర‌లించ‌డంతో శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం అని వైద్యులు నిర్ధారించి వెంట‌నే శ‌స్త్ర చికిత్స చేశారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించ‌డంతో హైద‌రాబాద్ లోని నివాసానికే ప‌వ‌న్ ప‌రిమితం అయ్యారు. హైద‌రాబాద్ వ‌చ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌వ‌న్ నివాసానికి వెళ్లి ప‌రామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *