NewsInn

News in a Click

ద‌క్క‌ని గ‌వ‌ర్న‌ర్ ఆమోదం- సంధిగ్ధంలో ద‌ళ‌ప‌తి

ద‌క్క‌ని గ‌వ‌ర్న‌ర్ ఆమోదం- సంధిగ్ధంలో ద‌ళ‌ప‌తి

(చెన్నై,న్యూస్ఇన్‌)

టీవీకే అధినేత విజ‌య్ ద‌ళ‌ప‌తి కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. టీవీకే నేత‌లు రేపు ప్ర‌మాణ స్వీకారం అంటూ లీకులు ఇవ్వ‌డం…లోక్ భ‌వ‌న్ నుంచి ఇంకా ముఖ్య‌మంత్రిగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం కోసం ఎలాంటి అనుమ‌తులు లేక‌పోవ‌డం వంటి అంశాలు టీవీకే కు టెన్ష‌న్ పెంచుతున్నాయి. 108 స్థానాలు గెలుచుకున్న త‌మిళ‌గ వెట్రిగ క‌జ‌గం పార్టీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో 113 స్థానాల‌కు సంఖ్య చేరింది. మ‌రో ఐదుగురు స‌భ్యుల మ‌ద్ద‌తు కోసం టీవీకే పార్టీ ప్ర‌తినిధులు ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. వామ‌ప‌క్షలు సీపీఐ, సీపీఎం రెండు స్థానాలు న‌లుగురు టీవికే కు బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించాయి. దీంతో ఈ సంఖ్య 117 కు పెరిగింది. ఇత‌రులు కూడా టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు తాము సిద్ధం అని ప్ర‌క‌టిస్తున్నా…గ‌వ‌ర్న‌ర్ కు స‌మ‌ర్పించే జాబితాలో సంత‌కాలు చేయ‌క‌పోవ‌డం కొత్త స‌స్పెన్స్ క్రియేట్ చేస్తోంది. దీంతో గ‌వ‌ర్న‌ర్ 118 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంటే త‌ప్పు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు విజ‌య్ కు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని రెండు రోజులుగా చెబుతూనే ఉన్నారు. వ‌రుస‌గా మూడో రోజు కూడా విజ‌య్ ద‌ళ‌ప‌తి పార్టీ ప్ర‌తినిధుల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ ర‌వి అర్లేక‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని విజ్ఙ‌ప్తి చేసినా….గ‌వ‌ర్న‌ర్ మాత్రం రాజ్యంగ బ‌ద్ధంగానే నిర్ణ‌యం ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. దీంతో టీవీకే 118 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో ఇబ్బందుల ప‌డుతోంది.

టీవీకే అనుభ‌వ రాహిత్యం….

రాజ‌కీయాల్లో అనుభ‌వం లేని టీవీకే పార్టీ అధినేత తొంద‌ర పాటు చ‌ర్య‌లు కూడా కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయ‌ని రాజ‌కీయ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో సంపూర్ణ మెజార్టీ లేక‌పోయినా హుటా హుటిన గ‌వ‌ర్న‌ర్ ను కలిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోర‌డం భావ్యం కాద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించ‌డంతో అవ‌కాశం ఇవ్వాల‌ని కోరితేనే ఫ‌లితం ఉండేద‌ని ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని గ‌వ‌ర్న‌ర్ కు తెలియ చేయ‌డంతో…..రాజ్యంగం ప్ర‌కారం మెజార్టీ స‌భ్యుల బ‌లం చూపించాల‌ని కోరారు. దీంతో త‌మిళ రాజ‌కీయాల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తెర‌పైకి వ‌స్తున్నాయి. విజ‌య్ త‌న సినీ గ్లామ‌ర్ తో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు చూర‌గొన్నా…. రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌డంతో కొత్త స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటున్నారు. విజ‌య్ రాజ‌కీయ ప‌రిణితిని అంచ‌నా వేస్తున్న వీసీకే,ఐయుఎంఎల్ లాంటి పార్టీలు కొత్త కొత్త రాజ‌కీయ డిమాండ్ల‌ను తెర‌పైకి తెస్తుండ‌డం…విజ‌య్ పార్టీ ప్ర‌తినిధులు వారి డిమాండ్ల‌పై ఎటూ తేల్చులేకపోతుండ‌డంతో టీవీకే ప్ర‌భుత్వ ఏర్పాటుకు కు సానుకూలంగా ఉన్న సంకేతాలు ఇస్తున్నా……లేఖ‌లు మాత్రం ఇవ్వ‌క‌పోవ‌డం హాట్ హాట్ గా మారింది. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారంపై గుర్రుగా ఉన్న టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన త‌మకు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు అదేశాలు ఇవ్వాల‌ని కోరింది.

హైద‌రాబాద్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్ త‌ర‌లించింది. ఐదుగురు ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ లో మ‌కాం వేయ‌నున్నారు. త‌మిళ నాడు రాజ‌కీయాల్లో స్ప‌ష్ట‌త వ‌స్తేనే వీరంతా త‌మిళ‌నాడుకు వెళ్ల‌నున్నారు.

టీవీకే కు విసీకే లేఖ‌…..

శుక్ర‌వారం జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో డీఎంకే తో క‌లిసి ఉన్న వీసీకే డీఏంకే తో తెగ‌తెంపులు చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం డీఎంకే కు న‌చ్చ‌చెప్పి వీసీకే పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. అయితే ప్ర‌క‌ట‌న వెలువ‌డితే గానీ వీసీకే పార్టీ నిర్ణ‌యంపై ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *