(హైదరాబాద్,న్యూస్ఇన్)
గుజరాత్ అభివృద్ధికి ఇస్తున్న నిదులనే తెలంగాణాకు ఇస్తున్నామని, తెలంగాణాపై కేంద్రం వివక్ష చూపెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వివక్ష చూపిస్తే తెలంగాణాకు సగం నిధులు కూడా అందవని వ్యాఖ్యానించారు. నేను అలాగే వ్యవహరిస్తే… మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో….అక్కడికి వెళ్లలేరు…అందకే నాతో కలువు అని ప్రధాని రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం అందరిలో నవ్వులు పూయించింది. హైటెక్స్ లో వివిద కార్యక్రమాల ప్రారంభోత్సవాలను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…. భారత దేశం సంస్కరణల్లో వేగంగా ముందుకు వెళుతుందున్నారు. రూ.9,400 కోట్ల రుపాయాలతో పనులను ప్రారంభించారు. రహదారులు, జహీరాబాద్ ఇండ్రస్ట్రీయల్ పార్క్, కాకతీయ టెక్స్ టైల్ పార్క్, రైల్వేలలో అభివృద్ధి పనులను పీఎం ప్రారంభించారు.

గత 12 ఏళ్లుగా దేశంలో అన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరిగిందన్నారు. రోడ్లు, రైల్వేలు, విమానయాన రంగం అభివృద్ధి చెందిందన్నారు. జాతీయ రహదారులు తెలంగాణాలో గత 12 ఏళ్లలో రెట్టింపుఅయ్యాయన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఏపీకి వెయ్యికోట్ల కంటే రైల్వేకు నిధులు తక్కువ గా వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 5 వేల 500 కోట్ల రైల్వే నిదులు తెలంగాణాకు దక్కాయన్నారు. రేవంత్ నేను చెబుతున్నది విను.. అని ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలు చేశారు. సోలార్ పవర్ వినియోగంలో దేశం పెద్ద దేశాల సరసన చేరిందని ప్రధాని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంధన వనరుల వినియోగంపై దృష్టి పెట్టిందన్నారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ వినియోగంలో ఎంత అవసరం ఉంటే అంతే వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా దేశానికి ఎంతో లాభదాయకంగా మారుతుందన్నారు. తెలంగాణా యువత కొత్త కలలు కంటుందుని మోడీ అన్నారు. వికసిత్ తెలంగాణాలో తమ పాత్ర పోషించేందుకు యువత, ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. తెలంగాణా ప్రజల కలలను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా పనిచేస్తుందన్నారు. ఇది రాజకీయ వేదిక కాదని, ఈ వేదికపై నేను రాజకీయాలు మాట్లాడ లేనన్నారు. 2047 అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు.









Leave a Reply