(హైదరాబాద్,న్యూస్ఇన్)
మరో ఏడాది బంగారం కొనవద్దు,,,కార్ లో ఒక్కరు వెళ్ల వద్దు…,ప్రజా రవాణను వినియోగించుకుండి…ఇంధన వనరులను కాపాడుకోండి…. ఇంధన ధరలు భారీగా పెరిగాయి….వంటనూనెల వినయోగం తగ్గించుకోండి…..ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ఆర్ధిక వేత్త కాదు…. విశ్వగురు నరేంద్ర మోడీ…. మోడీ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ముందుగానే అప్రమత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని మోడీ పర్యటనలో రాజకీయ వ్యాఖ్యల కంటే…ఆర్ధిక పాఠాలపైనే ఎక్కుగా దృష్టి పెట్టినట్లు కనిపించింది. దేశం ఇబ్బంది కరమైన పరిస్థితులను ఎదుర్కొంటుందని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న బహిరంగ సభ కావడం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని మోడీ హైదరాబాద్ పర్యటన ఆకర్షించింది. తెలంగాణాలో 9,440 కోట్ల రుపాయలతో అభివృద్ధి పనలను ప్రారంభించారు.దేశ ఆర్ధిక పరిస్థితి గురించి ప్రదాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదనన సంకేతాలు ఇచ్చినట్లయింది. కోవిడ్ సమయం నుంచి నేటి వరకు చోటు చేసుకుంటున్న పరిణామాలతో దేశం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందున్న వ్యాఖ్యలు బహిరంగంగానే చేశారు. దేశంలో సంస్కరణలు అమలు చేస్తున్నా ఆర్ధిక పరిస్థితులు బాగాలేవన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని ఇచ్చారు.
ప్రధాని స్పీచ్ వీడియో….
రాజకీయంగా ఈ పర్యటనతో తెలంగాణాలో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపే విధంగా ఉంటుందని భావించినా…. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకే ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. బెంగాల్ విజయాన్ని బీజేపీ ఖాతాలో వేసుకున్నామని…ఇక తెలంగాణాలో కూడా ప్రజలు బీజేపీ ని కోరుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించిందన్నారు. తెలంగాణా లో కూడా కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరించారని మోడీ వ్యాఖ్యలు చేశారు.
మోడీ వ్యాఖ్యలను పరిశీలిస్తే…..

పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి సామాన్య ప్రజలకు కష్టాలు వస్తున్నాయి. యుద్ధ ప్రభావంతో పెట్రో ఉత్పత్తుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. తద్వారా భవిష్యత్తులో పెట్రో ధరల పెంపు కు ప్రజలు సిద్ధం కావాలని హింట్ ఇచ్చారు. ప్రజా రవాణనే ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. కార్లలో వెళుతుంటే కార్ పూలింగ్ ద్వారా కలిసి వెళ్లాలన్నారు. మరో ఏడాది వరకు బంగారం కొనవద్దని చెప్పారు. విదేశీ పర్యటనలకు వెళ్లకుండా ఉంటే ఆర్ధికంగా కలిసి వస్తుందన్నారు. ఇలా ప్రతి కుటుంబం ఆర్ధిక క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సూచనలు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ అంశాలను పరిష్కరించడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న విషయాలను మోడీ వెల్లడించలేదు. ప్రజలే త్యాగాలు చేసేందుకు సిద్దంగా ఉండాలని దేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు.
ప్రజలను సిద్ధం చేయడమే…..

ప్రధాని మోడీ వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాజకీయంగా భాగంగానే ఇప్పటి నుంచి తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చకునేవిగా కనిపిస్తున్నాయి….. ప్రజలు ఆర్ధిక క్రమశిక్షణకు నేర్చుకోవాలని సూచించినట్లు ఉన్నా…పాలనలో భాగంగా కఠిననిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్న సంకేతాలు కేంద్రం ఇస్తోంది. భవిష్యత్తులో పెరిగే ఇంధన వనరుల ధరలను మోసేందుకు సిద్ధం కావాలన్న పిలుపు ముందుగానే మోడీ ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.











Leave a Reply