(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సాధ్యం అయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం దగ్గర సీఎం నివాళులు అర్పించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. రెండున్నర ఏళ్ల క్రితం డిసెంబర్ 7న రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలన ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాల గురించి వివరించారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులు అందించారు.
రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.












Leave a Reply