(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగర ప్రజలకు ఉచితంగా ఎం ఎం టి ఎస్ ప్రయాణాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా…. రైల్వే బోర్డు అందుకు అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనలకు పులిస్టాప్ పట్టట్లే. నగరంలో విస్తృతంగా ఎం ఎం టి ఎస్ సేవలను వినియోగించుకొని ప్రజా రవాణాను మెరుగు పరచాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి రైల్వే బోర్డు కు ప్రతిపాదనలు పంపింది.కానీ ఇప్పటికే భారీ నష్టాలు చవిచూస్తున్నామని
ఉచిత ప్రయాణాన్ని కల్పించలేమన్న రైల్వే బోర్డు. హైదారాబాద్ మహా నగరంలో ఎం.ఎం.టీ.ఎస్ ఉచిత ప్రయాణం అమలుచేయాలంటే
ఇప్పటి వరకు వస్తున్న ఆపరేషన్ నష్టాలను భరించడంతో పాటు …భవిష్యత్ లో వచ్చే నష్టాలను భరించాలని షరతు. ఎం.ఎం.టీ.ఎస్ రాష్ట్ర ప్రభుత్వ వాటా బకాయిలను చెల్లించాలని రైల్వే బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాత బకాయిలు చెల్లించడంతోపాటు నష్టాలను కూడా ముందుగానే చెల్లిస్తే ఉచిత ఎం ఎం టి ఎస్ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది.













Leave a Reply