(హైదరాబాద్,న్యూస్ఇన్)
నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు హోటళ్లు, ఓయో హోటళ్లు, లాడ్జీలతో పాటు రోడ్ల పై కూడా తనిఖీలు చేపట్టారు. స్వయంగా పోలీసు కమిషనర్ సజ్జనార్ అమీర్పేట్, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేస్తున్న అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్-ఇన్ రికార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు మరియు అవసరమైన అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. హోటల్ యాజమాన్యాలు అతిథుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీటీవీ వ్యవస్థలను నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బృందాలుగా విడిపోయి పోలీసులు ఏకకాలంలో అమీర్పేట్ ఎస్.ఆర్ నగర్ లోని పలు హోటల్లు లాడ్జిలలో సోదాలు చేపట్టారు. మలక్పేట్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, ఐఎస్ సదన్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో హోటళ్లలో సోదాలు నిర్వహించారు. అమీర్పేట్లో నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ స్వయంగా తనిఖీలు కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు.

ప్రధానంగా హాటళ్లు, లాడ్జీలలో ఎవరెవరు బస చేశారు, ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, నగరానికి ఎందుకు వచ్చారు అనే అంశాలపై దృష్టి సారించారు. అనుమానస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల కాలంలో నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలు పడ్డుబడుతుండడంతో తనిఖీలు ఉదృతం చేశారు. ఈ సందర్భంగా వాహనాల నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు వినియోగంపై కూడా కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.












Leave a Reply