NewsInn

News in a Click

మామిడి ప‌ళ్లు తిని అక్కా, చెల్లెళ్ల మృతి

మామిడి ప‌ళ్లు తిని అక్కా, చెల్లెళ్ల మృతి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మ‌మిడి ప‌ళ్లు తిని అక్కా, చెల్లెళ్లు మృతి చెదండం న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతోంది. నోరూరించే మామిడిప‌ళ్లే అని తినాల‌నుకున్నా ఈ ఘ‌ట‌న ప‌ళ్లు తినేందుకు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని నారాయ‌ణగూడ ప్రాంతంలో ఓ కుటుంబం ఎంతో ఇష్టంగా మామిడిప‌ళ్లు కొనుక్కుని తిన్న ఘ‌ట‌న ఆ కుటుంబంలో విషాదం నింపింది. అక్కా, చెల్లెళ్లు ఇద్ద‌రు ప‌ళ్లు తిన్న కొద్ది సేప‌టికే వాంతులు విరోచ‌నాల‌తో ఆసుప‌త్రిలో చేరారు. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యులంద‌రూ అదే స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు. కుటుంబ స‌భ్యులంతా ఒక్కొక్క‌రు ఆసుపత్రి పాలయ్యారు. ఒక రోజు వ్య‌వ‌ధిలో అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న మూడు రోజుల క్రితం చోటు చేసుకున్నా…. ఆల‌స్యంగా వెలుగు చూసింది. న‌గ‌రంలో మామిడి కాయ‌ల‌ను ప‌ళ్లుగా మార్చేందుకు ర‌సాయ‌నాలు ఉప‌యోగిస్తున్నార‌న్నది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఒక కుటుంబం మొత్తం ఫుడ్ పాయిజ‌న్ తో ఇబ్బందులు ప‌డి మ‌మిడి ప‌ళ్లు తిని అక్కా, చెల్లెళ్లు మృతి చెదండం న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా మామిడి ప‌ళ్ల వ్యాపారులు వాడే ర‌సాయనాల‌పై మ‌రో సారి తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. భార‌త దేశం నుంచి ఎగుమ‌తి చేసే మామిడి ప‌ళ్ల‌లో ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని జ‌పాన్ దేశం భార‌త మామిడి ప‌ళ్లను దిగుమ‌తి చేసుకోవ‌డంపై నిశేధం విధించింది. తాజాగా నేపాల్ దేశం కూడా ఇదే బాట‌లో న‌డుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. భారత దేశం నుంచి మామిడి ప‌ళ్ల దిగుమ‌తిని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *